దుర్గాపూజ వైభవంగా జరిగే పశ్చిమబెంగాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనాగరికంగా వ్యవహరించారు. శాంతియుతంగా జరిగే వేడుకల్లో హింస, విధ్వంసానికి తెగబడ్డారు. ఖురాన్ ను ఓ వ్యక్తి దూషించినట్టున్న ఫేస్ బుక్ పోస్టు బుధవారం రాత్రి సోషల్మీడియాలో వైరల్ అయింది. ఆ తరువాత కొందరు మతోన్మాదులు వీధుల్లోకి వచ్చి దుర్గా పూజా మండపాలను ధ్వంసం చేశారు.
అయితే ఖురాన్ ను అవమానించామన్న ప్రచారం అవాస్తమని…సెక్యూరిటీ నిద్రపోతున్న సమయంలో ఎవరో దుండగులు వచ్చి ఖురాన్ ప్రతిని అక్కడ పెట్టి వెళ్లారని మహానగర్ పూజా ఉద్యాపన కమిటీ కార్యదర్శి తెలిపారు.
దుండగులెవరో వచ్చి కావాలని చిత్రాలు తీసుకుని వెళ్లారు. గంటల వ్యవధిలో ఫేస్ బుక్లో ఆ చిత్రాలు షేర్ చేశారు. కావాలనే మత కల్లోలాలు సృష్టించే కుట్ర మొదలైందని,… దీనివెనక బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇ-ఇస్లాం కార్యకర్తల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు.
చంద్ పూర్లోని హజీగంజ్. చటోగ్రామ్ లోని బాంష్ ఖలీ, చాపైనవాబ్ గంజ్ లోని శివగంజ్, కాక్స్ బజార్ లోని పెకువాలోని ఆలయాల్లో హిందువులపై దాడులు జరిగాయి. హింసాత్మక ఘర్షణల్లో ముగ్గురు హిందువులు చనిపోయారు. అయితే పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.స్థానిక హిందువులు కొందకు ట్విట్టర్లో ఆ దాడుల దృశ్యాల్ని షేర్ చేశారు.
పరిస్థితి చాలా భయంకరంగా ఉంది.. శిల్పారాలో 150 హిందూకుటుంబాలపై దాడులు చేశారు. ఇళ్లల్లోకి చొరబడ్డారు. కాక్స్ బజార్, నోహాలీలో విధ్వంసం సృష్టించారని, మున్సిపల్ కాళీమందిర్లో విగ్రహాల విధ్వంసంతో పాటు మహిళలపైనా దాడి చేశారని…ఇద్దరు చనిపోయారని.. స్థానిక అడ్వొకేట్ డాక్టర్ గోవింద చంద్ర ప్రామాణిక్ ఆ వీడియోను జత చేస్తూ ట్వీట్ చేశారు.
నేషనల్ హిందూ యూత్ గ్రాండ్ అలయన్స్ జిల్లా ప్రచార కార్యదర్శిని పొట్టనబెట్టుకున్నారని ఆయన అన్నారు. మరికొందరు కాళీ పాండాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలను షేర్ చేశారు. ‘హిందూ వాయిస్’ అనే వార్తా పోర్టల్ ….కాళీమాత విగ్రహాన్ని నదిలోకి విసిరివేసిన మరో వీడియోను షేర్ చేసింది. “బంగ్లాదేశ్లోని కొమిల్లాలో దుండగులు కొందరు 9 దుర్గా మండపాలు, విగ్రహాలను ధ్వంసం చేశారు. ఉదయం కూడా వందలాదిగా వచ్చిన ముస్లింలు దాడి చేశారు. దాడులింకా కొనసాగుతున్నాయి. హిందువులు భయపడుతున్నారు. మూకను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. ”అని ట్వీట్ చేసింది.
నీల్ అనే ట్విట్టర్ యూజర్…చిట్టగాంగ్ జిల్లాలో ధ్వంసం చేసిన దుర్గా పండల్ చిత్రాల్ని షేర్ చేశారు.
బంగ్లాదేశ్ హిందూ ఐక్యతా మండలి గత 24 గంటల్లో జరిగిన దాడులు , హింసకు సంబంధించి విచారం వ్యక్తం చేసింది. అప్రమత్తంగా ఉండాలని కోరింది. “కామిల్లాలోని హిందువులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గుడిలో కలిసి ఉండండి. ననువా దిఘీర్ పార్ ప్రాంతంలో సహాయం కోసం బంగ్లాదేశ్ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం ”అని ట్వీట్ చేశారు.
బంగ్లాదేశ్ చరిత్రలో ఇది చీకటి రోజు…దుర్గాష్టమి నాడు మండపాల ధ్వంసం ఆందోళనకరం, విగ్రహ నిమజ్జన ఏర్పాట్ల కోసం హిందువులు మండపానికి కాపలాగా ఉన్నారు. అలాంటి సమయంలో ముష్కరులు విధ్వంసం సృష్టించారు. కానీ ప్రపంచం అంతా మౌనంగా చూస్తోంది. అని మరొకరు ట్వీట్ చేస్తే….”బంగ్లాదేశ్లో హిందువులపై ఎందుకు అంత ద్వేషం ఉంది? హిందువులు పుట్టుకతో బంగ్లాదేశ్లో నివసిస్తున్నారు.. 1971 లో ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది హిందువులు. బంగ్లాదేశ్ హిందువులు ముస్లింలను తమ సోదరులుగా భావించారు. 90% ముస్లింలకు 8% హిందువులు సమస్యలకు ఎలా కారణం అవుతారు? అని స్థానిక కౌన్సిల్ ట్వీట్ చేసింది.
అక్టోబర్ 13 ని ‘బ్లాక్ డే’ అని పిలుస్తూ, బంగ్లాదేశ్ హిందువులను రక్షించడానికి పిలుపునిస్తూ, కౌన్సిల్ వారి తాజా ట్వీట్లో, “గత 24 గంటల్లో ఏమి జరిగిందో మేము ట్వీట్లో ప్రచురించలేము. బంగ్లాదేశ్ హిందువులు కొంతమంది వ్యక్తుల అసలు ముఖాలను చూశారు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మాకు తెలియదు. కానీ బంగ్లాదేశ్ హిందువులు 2021 లో దుర్గా పూజను ఎన్నటికీ మరచిపోలేరు.
అధికారులు, సంబంధిత మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై స్పందించింది. దుర్గా పండల్లో ఖురాన్ ఉందనే వార్తలతో అప్రమత్తం చేశసామని…ప్రజలెవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరింది.
టెలికాం మంత్రి ముస్తఫా జబ్బర్ ఆ పోస్ట్లు , వీడియోలను వెంటనే తీసివేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. వందకు పైగా అకౌంట్లనుంచి ఆ ఫొటోలను తొలగించాలని అభ్యర్థించాం. త్వరలోనే ఆ అకౌంట్ల్ బ్లాక్ అవుతాయని ఆశిస్తున్నామని జబ్బార్ అన్నారు.
ఎవరెన్ని చెబుతున్నా స్థానిక హిందువులు మాత్రం ఇంకా భయంగుప్పిట్లోనే ఉన్నారు. ప్రశాంతంగా దుర్గాపూజ చేసుకుంటున్న సమయంలో ఈ హింసేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.