శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల సభలో జనాలు ఎక్కువ సంఖ్యలో హాజరవడంతో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను ఉల్లంఘించినందుకు కేసు నమోదైంది. కమిషన్ కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన నిబంధనల ప్రకారం సభకు వెయ్యి మందికి మించి అనుమతి లేదు.
ఫరీద్కోట్ సభలో సుమారు 6,000 మంది వ్యక్తులు హాజరైన కారణంగా సుఖ్బీర్ సింగ్, SAD అభ్యర్థి పరంబన్స్ సింగ్ రొమానా సహా ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫరీద్కోట్ రిటర్నింగ్ అధికారి(సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్) బల్జీత్ కౌర్ పోలీసులను ఆదేశించారు.
ఎన్నికలు జరగనున్న పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలలో రాజకీయ సభలు, రోడ్ షోలపై నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది, అయితే కమిషన్ రాజకీయ పార్టీల బహిరంగ సభలకు హాజరయ్యే వారి సంఖ్యను 1,000కి పెంచి సడలింపులను మంజూరు చేసింది.