దేశ రాజధానిలోని రాజ్ నివాస్లో జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ 22వ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి విపిన్ సంఘీ, సక్సేనాతో ప్రమాణం చేయించారు. ఢిల్లీ కొత్త ఎల్జీగా సక్సేనాను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించినట్లు మే 23న రాష్ట్రపతి భవన్ ప్రకటించింది.
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సహా రాష్ట్ర పౌరుల సహకారంతో దేశ రాజధానిలో కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని సక్సేనా అన్నారు. దేశ రాజధానిని కదిలించిన అనేక అల్లర్లను మరచిపోవాలని పౌరులను కోరుతూ.. ఢిల్లీని ఆనంద నగరంగా అభివృద్ధి చేయాలనే తన కల గురించి ఆయన చెప్పారు.
https://twitter.com/ANI/status/1529708392201170944?s=20&t=rFnjJcdphul8xkM9eTSNNw
“నేను లోకల్ గార్డియన్గా పని చేస్తాను. మీరు నన్ను రాజ్ నివాస్లో కంటే రోడ్లపైనే ఎక్కువగా చూస్తారు. ఢిల్లీలో కాలుష్యం ప్రధాన సమస్య. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం సహా స్థానిక పౌరులతో కలిసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అసంఘటిత రంగాల్లో పని చేసే వారికి శిక్షణ ఇస్తాం’’ అని చెప్పారు.
“ఢిల్లీలో ఎన్నో అల్లర్లు జరిగాయి… వాటన్నింటినీ మరచిపోవడమే మంచిది.. ప్రజలు కలిసి మెలసి ఉండాలి.. ఢిల్లీని ఆనంద నగరంగా అభివృద్ధి చేయాలన్నది నా కల” అని ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా అన్నారు.