వైసీపీలో టాప్ ఫైవ్ నాయకుల్లో ఒకరుగా ప్రచారం పొందిన పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు విజయ్ సాయి రెడ్డి ఫక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. వైసీపీకి గుడ్ బై కొట్టి బిజెపిలో చేరే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో కొన్ని రాయబారాలు జరిగినట్లు టాక్.
వాస్తవానికి వైసీపీ పార్టీ పెట్టినప్పటి నుంచి,, అధికారంలోకి వచ్చే దాకా.. అంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు పాటు విజయ సాయి రెడ్డి పార్టీలో నెంబర్ టు గా వ్యవహరించారు. వ్యక్తిగతంగా ఫైనాన్సియల్ ఆడిటర్ ఆయన విజయసాయిరెడ్డి.. ఆర్థిక సలహాదారుగా వైయస్సార్ కుటుంబానికి దగ్గరయ్యారు. తర్వాత కాలంలో వైయస్ జగన్ వ్యాపారాల్లో సలహాదారిగా భాగస్వామిగా వ్యవహరించారు. అప్పట్లో వైయస్ జగన్ తో పాటు కొంతకాలం పాటు జైలు జీవితం గడిపారు. అప్పుడే జగన్కు బాగా సన్నిహితుడుగా పేరు తెచ్చుకున్నారు. విజయ సాయి రెడ్డి నోరు విప్పితే .. జగన్ ఆర్థిక వ్యవహారాలు గుట్టు రట్టు అవుతాయి అని చెప్తారు. అందుకే సిబిఐ అధికారులు జైలులో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డిని ఎంత ఇబ్బంది పెట్టినా వేధించిన ఒక్క అక్షరం కూడా నోరు విప్పలేదు. ఈ నమ్మకాన్ని జగన్ మనసులో పెట్టుకున్నారు. అందుకే జైలు నుంచి బయటకు వచ్చాక పార్టీలో నెంబర్ టు గా నిలబెట్టారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు వచ్చాక .. మొదటిసారి వచ్చిన రాజ్యసభ సీటుని విజయ సాయి రెడ్డికే అప్పగించారు. ఆ తర్వాత కాలంలో పార్టీ తరఫున ఢిల్లీలో చక్రం తిప్పడం ఇతర పార్టీలతో సంబంధాలు నిర్వహించడంలో విజయ సాయి రెడ్డి పేరు మార్మోగిపోయింది. ముఖ్యంగా బిజెపి అగ్రనేతలకు టచ్ లో ఉంటూ వైసిపి మీద నెగటివ్ షేడ్ లేకుండా చేయగ లిగారు.
ఇదంతా గత కాలపు వైభవం. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉత్తరాంధ్ర వ్యవహారాలు ఇన్చార్జిగా విశాఖపట్నం పంపించారు. విశాఖపట్నంలో వైసీపీ ప్రభుత్వం రాజధా ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంది. ఈ సమయంలో అక్కడ ఆర్థిక వ్యవహారాలు భూముల వ్యవహారాలు చక్కబెట్టడంలో విజయసాయిరెడ్డి ముందుగా నిలిచాడు. ఇదంతా పార్టీ కోసమే చేసామని విజయ సాయి రెడ్డి వర్గం చెబుతుండగా,, ప్రత్యర్ధులు మరోలా ప్రచారం చేశారు. విశాఖపట్నం చుట్టూత వందల ఎకరాల్ని విజయసాయిరెడ్డి నొక్కేసారని, వందలకోట్లు దోచుకున్నారని ప్రచారం చేసి పెట్టా రు. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ కి దఫ దఫాలుగా చేరిపోయాక విజయ్ సాయి రెడ్డి ప్రాధాన్యం సడన్గా పార్టీలో తగ్గిపోయింది.
అప్పటిదాకా పార్టీలో నెంబర్ వన్ గా నిలిచిన విజయసాయిరెడ్డి ని ఢిల్లీకి పరిమితం చేశారు. విశాఖపట్నం ఇన్చార్జి హోదినించి తప్పించేశారు. పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున వైయస్ జగన్ నిర్వహించే కీలక సమావేశాల్లో విజయసాయి రెడ్డికి పిలుపు లేకుండా పోయింది. ఇలాగా విజయసాయి రెడ్డికి అల్లుడు తారకరత్న చనిపోయినప్పుడు తెలుగుదేశం నాయకులతో,, ముఖ్యం గా చంద్రబాబు, బాలకృష్ణతో ఆయన దగ్గరికి మెలిగారు. దీంతో వైసిపి పెద్దలు విజయసాయిరెడ్డిని పూర్తిగా లో ఫ్లైన్లోకి వైసిపి పెద్దలు విజయసాయిరెడ్డిని పూర్తిగా లూప్ లైన్ లోకి పంపించారు. మొన్నటి ఎన్నికల్లో విజయసాయి చెప్పిన నాయకులకి టికెట్లు కూడా దక్కలేదు. చివరి నిమిషంలో నెల్లూరుకి సరైన అభ్యర్థి లేని సమయంలో,, విజయ సాయి రెడ్డిని పిలిపించి అప్పటికప్పుడు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయించారు. అంతకుమించి మొన్నటి ఎన్నికల్లో పెద్దగా ప్రాధాన్యం ఏమీ ఇవ్వలేదు.
వైసిపి ఇప్పుడు చిత్తుచిత్తుగా ఓడిపోయింది. మరి తెలుగుదేశం పెద్దలు విశాఖపట్నం కేంద్రంగా జరిగిన లావాదేవీలు వెలికి తీస్తున్నారు. అప్పట్లో జరిగిన భూముల స్కాముల మీద విచారణ ఊపందు కొంటోంది. పోలీసు దర్యాప్తు లోతుల్లోకి వెళితే విజయ్ సాయి రెడ్డిని అరెస్టు చేయడం కేసులు ఉచ్చులో బిగించడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. ఇటువంటి అప్పుడు వైసిపి నుంచి ఎంతవరకు మద్దతు ఉంటుంది అనేది కూడా ప్రశ్నార్థకమే.
ఈ పరిస్థితుల్లో బిజెపికి వెళ్లిపోయి తలదాచుకోవడమే సేఫ్ అని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు వైసిపి మద్దతు ఇవ్వకపోవటం,, అటు తెలుగుదేశం అన్ని వైపులా వేటను మొదలుపెట్టడం తో విజయసాయి రెడ్డికి దారులు మూసుకొని పోతున్నాయి. దీంతో బిజెపి వైపు ఆయన అడుగులు వేస్తున్నారు అని తెలుస్తోంది.
ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో బిజెపి పెద్దలతో విజయసాయి రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో మాదిరిగా టిడిపి అగ్రనాయకత్వం కూడా విజయ్ సాయి పట్ల తీవ్రమైన ద్వేషంతో లేనే లేదు. దీంతో టీడీపీ కూడా ఈ మార్పుని అడ్డుకోకపోవచ్చు. అన్ని సవ్యంగా జరిగితే ఈ నెలలోనే విజయసాయిరెడ్డి జండా ఎగరవేయడం ఖాయం అంటున్నారు.