వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేశారు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ. షర్మిళను పరామర్శించేందుకు వెళ్లే ప్రయత్నం చేసిన విజయమ్మను కూడా పోలీసులుఅరెస్టే చేశారు. దీంతో విజయమ్మ లోటస్ పాండ్ లోని తన నివాసంలోనే నిరాహారదీక్షకు దిగారు. తెలంగాణలో పాదయాత్ర చేయడం నేరమా అని ఆమె నిలదీశారు. అంతకుముందు షర్మిల ప్రగతిభవన్ ముట్టడికి వెళ్తోందన్నా సమాచారంతో పోలీసులు ఆమెను ఆరెస్ట్ చేశారు. కారులోనుంచి దిగేందుకు ఆమె వ్యతిరేకించడంతో అలాగే కారును లిఫ్ట్ చేశారు పోలీసులు. క్రేన్తోనే లిఫ్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కు షర్మిలను కారుతో సహా తరలించారు. పీఎస్కు వెళ్లగానే.. బలవంతంగా కారు డోర్లు తీసి ఆమెను బయటికి లాగారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. షర్మిల అరెస్ట్తో ఎస్ఆర్నగర్ పీఎస్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎస్ఆర్నగర్ పీఎస్ దగ్గరకూడా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
అటు షర్మిల పాదయాత్రకు హైకోర్ట్ అనుమతిచ్చింది. అయితే మత పరమైన, అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేయవద్దని.. పాదయాత్రకు అనుమతికోరుతూ మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. షర్మిలను అరెస్ట్ చేసిన తరువాత వైఎస్సార్టీపీ నాయకులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు.