కోర్టు ధిక్కరణ కేసులో విజయ్ మాల్యాకు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీ కోర్టు.. రెండువేల రూపాయల జరిమానా కూడా విధిస్తూ…జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ పి.ఎస్.నరసింహతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.
నేరం చేసి దేశంవిడిచి వెళ్లింది కాక..ఎలాంటి పశ్చాత్తాపం ఆయనలో లేదని..ఎన్ని అవకాశాలు ఇచ్చినా క్షమాపణ చెప్పలేదనికోర్టు అభిప్రాయపడింది. కోర్టు గౌరవాన్ని కాపాడేందుకే శిక్షవేసినట్టు ధర్మాసనం తెలిపింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు 40 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 3వందల కోట్లు పంపించాడు. ఆ మొత్తాన్ని 8 శాతం వార్షిక వడ్డీతో సంబంధిత రికవరీ ఆఫీసర్ వద్ద నాలుగు వారాల్లోగా తిరిగి డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అది జరిగేలా కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలు చూడాలనీ సూచించింది. 2000 జరిమానాను నాలుగు వారాల్లోగా సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ పేరున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.