మహా కుంభమేళాలో తొక్కిసలాట నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ దురదృష్టకర సంఘటనకు కారణాలు తెప్పించుకొని చర్యలు ప్రారంభించింది. ప్రయాగరాజ్ అంతట భక్తులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించేలా నిర్ణయాలు తీసుకున్నారు. పుకార్లు, వదంతులు నమ్మవద్దని భద్రత నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
…….
ప్రయాగరాజ్ లో భక్తుల కోసం కొన్ని నిబంధనలు విధించారు.
కుంభమేళా జరిగే ప్రాంతాన్ని నో వెహికిల్ జోన్గా ప్రకటించారు.
మహాకుంభ్ ప్రాంతంలోకి వాహనాల ఎంట్రీని పూర్తిగా నిషేధించారు.
అలాగే వీవీఐపీ పాసులను ఇతర రకాల పాసులను రద్దు చేశారు.
వెహికిల్ ఎంట్రీ కోసం ఇచ్చే ప్రత్యేక పాసులకు కూడా అనుమతి లేదు.
ప్రభుత్వ మరియు ఆసుపత్రి వాహనాల కోసం వన్వే రూట్లను అమలు చేస్తున్నారు.
భక్తులు సులువుగా నడిచేందుకు వన్వే ట్రాఫిక్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు.
ప్రయాగ్రాజ్ సమీప జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను ఆ జిల్లా సరిహద్దులకే పరిమితం చేస్తున్నారు.
డిస్ట్రిక్ బోర్డర్ల వద్ద వాహనాలను నిలిపివేస్తున్నారు.
కోట్ల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో.. క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను తక్షణమే ప్రయాగ్రాజ్కు పిలిపించారు. 2019లో అర్థకుంభమేళాను సక్సెస్ చేసిన టీం తో సమన్వయం చేస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ దాకా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు.
……..
మొత్తం మీద ప్రయాగరాజ్ లో పరిస్థితిని చక్కదిద్దినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. భక్తుల భద్రత రక్షణకు పెద్దపేట వేస్తున్నట్లు వివరిస్తున్నాయి. అందుచేత ప్రశాంతంగా వచ్చి అమృత స్నానాలు ఆచరించాలని సూచిస్తున్నారు