అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్ జర్నలిస్ట్ విద్యారణ్య కామ్లేకర్ సంతాప సభ హైదరాబాద్ లో జరిగింది. ప్రెస్ క్లబ్ లో జరిగిన సభకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాడభూషి శ్రీధర్ సహా సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంస్మరణ నిర్వహించారు. 40 ఏళ్లపాటు హిందీ మిలాప్, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి వంటి ప్రముఖ పత్రికల్లో పనిచేశారు విద్యారణ్య. ఆయనతో కలిసి పనిచేసిన మిత్రులు ఆయన శిష్యగణం విద్యారణ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. జాతీయవాదిగా నీతినిజాయతీ విలువలతో కూడిన జీవితాన్ని విద్యారణ్య గడిపారని దత్తాత్రేయ అన్నారు. ప్రతీఏంటా హిందీ జర్నలిస్టులకు విద్యారణ్య పేరిట అవార్డు ఇవ్వాలని హిందీ జర్నలిస్ట్ట్స్ అసోసియేషన్ ఈ సందర్భంగా నిర్ణయించింది. ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ వేణు గోపాల్ నాయుడు సహా సీనియర్ జర్నలిస్టులు హాజరై ఆయనకు నివాళులు అర్పించారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)