
Suvendu Adhikari (Leader of the Opposition in the West Bengal Legislative Assembly)
2021లో పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాలు విడుదలై తరువాత ఆ రాష్ట్రంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల గురించి అందరికీ తెలుసు. నాటి హింసాకాండను బహుషా దేశం మర్చిపోయి ఉండదు. అయితే నాటి హింసకు సంబంధించిన వీడియోలు, బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులను హింసించిన తీరుకు సంబంధించి వీడియోలు ఇప్పుడు యూపీ ఎన్నికల సందర్భంగా వైరల్ అవుతున్నాయి. యూపీలో మమతా బెనర్జీ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆ వీడియోలను వాడుకుంటున్నారు ఆరాష్ట్ర నాయకులు, కార్యకర్తలు. అయితే నాటి పరిస్థితుల్ని తలుచుకుంటూ మమతపై మరోసారి మండిపడ్డారు ఆమె ప్రత్యర్థి బీజేపీ నేత సువేందు అధికారి. జమ్ముకశ్మీర్ కంటే దారుణంగా పశ్చిమబెంగాల్లో పరిస్థితులు ఉన్నాయని… రాష్ట్రంలో హిందువులు ప్రమాదంలో పడ్డారని ఆరోపించారు. అసలు నాటి హింసకు కారణం టీఎంసీ నాయకుడు షేక్ సుఫియాన్ అనిమరోసారి అన్నారు సువేంది. ఎన్నికల్లో నందిగ్రామ్ పోలింగ్ ఏజెంట్ సుఫియాన్.
https://twitter.com/ANI_multimedia/status/1491985243574013955?s=20&t=bvgaoSfI2vp8RPdRgsuzSw
పశ్చిమబెంగాల్లో “gas chamber for democracy” వంటి పరిస్థితిని సృష్టించి ఎన్నికల అనంతర హింసాకాండకు పాల్పడింది టీఎంసేనని …హింస కారణంగా లక్షమంది హిందువులు రాష్ట్రంనుంచి పారిపోయారని గుర్తు చేశారు. అదే సమయంలో పెద్దఎత్తున చొరబాటుదాడులు రాష్ట్రంలోకి ప్రవేశించారని అన్నారు.
బీజేపీ కార్యకర్త దేబబ్రతమైతీ హత్యకేసులో సుఫియాన్ నిందితుడు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక…నందిగ్రామ్ లోని చిల్లోగ్రామ్ లో టీఎంసీ గుంపు చేసిన దాడిలో తీవ్రగాయాలపాలైన మైతీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మే 13న మరణించారు. దేబబ్రత మైతీ నందిగ్రామ్ ఓటర్. కేవలం బీజేపీకి, అక్కడి అభ్యర్థినైన తనకు ఓటేసినందుకే హత్య చేశారని…కేవలం మైతీని మాత్రమే కాదు…. బీజేపీకి మద్దతిచ్చిన ఎందరినో మమతాబెనర్జీ హయాంలో ఆ పార్టీ గూండాలు చంపేశారని సువేందు ఆందోళనవ్యక్తం చేస్తూవస్తున్నారు నాటి నుంచి.
https://twitter.com/ANI/status/1491925075368439810?s=20&t=N_gHYb09wPyB9lAtdYY3uQ
కోల్ కతా హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ మానవహక్కుల కమిషన్ బృందం నందిగ్రామ్ ప్రాంతాన్ని సందర్శించింది. టీఎంసీ కార్యకర్తలు, సుఫియాన్ పై ఆరోపణలు నిజమని తేలింది. ఆగస్టు 31న, సీబీఐ మైతీపై హత్యానేరం మోపింది, మూడు రోజుల తర్వాత కుటుంబ సభ్యుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత సుఫియాన్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులను సీబీఐ ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు సమన్లు జారీ చేశారు.
గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి సువేందు అధికారి చేతిలో మమత ఓడిపోయారు. తరువాత భవానీ పూర్ నుంచి పోటీచేసి గెలిచారు. ఆఎన్నికల్లో టీఎంసీ గూండాల దురాగతాలకు సంబంధించిన వీడియోలను సువేందు అధికారి పలుమార్లు షేర్ చేశారు. ఇప్పుడు యూపీఎన్నికల సందర్భంగా మరోసారి నాటి వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి 8న యూపీకి చెందిన ఓ బీజేపీ నాయకురాలు ట్వీట్ చేస్తూ ఆ వీడియోలను జత చేశారు.
“ప్రజాస్వామ్య విలువలంటూ బోధించే మహిళ చేతులకు రక్తం అంటింది.. ఈ విషయాన్ని యూపీ ప్రజలకు గుర్తు చేయాలనుకుంటున్నాను. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో అభ్యర్థి మనస్ సాహా సహా…55 బీజేపీ కార్యకర్తల రక్తం చూసిన నిరంకుశపాలకురాలు ఆమె’ అని అభివర్ణించింది. దానికి కొనసాగింపుగా సువేందు ట్వీట్ చేసారు.”లక్షలాది మంది బెంగాలీ హిందువులు తమ ఇళ్లను వదిలి పారిపోయే భయానక పరిస్థితుల్ని కల్పించారు. వారిపై దాడి చేస్తూ తరిమేశారు. ఇంకా కొందరు వెనక్కి తిరిగి రాలేదు. వాళ్లఆస్తుల్ని ధ్వంసం చేశారు, దోచుకున్నారు. ఇళ్లు తగులబెట్టారు. మహిళలపై అత్యాచారాలు సైతం చేశారు. ఆమె బూటకపు మాటలను నమ్మకండి” అని సువేందు వ్యాఖ్యానించారు.
తన వ్యాఖ్యలకు మద్దతుగా నాటి వీడియోలను షేర్ చేశారు సువేందు. 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులపై మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని మమతా బెనర్జీ మద్దతుతోనే ఆమె పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారని…సందర్భం వచ్చినప్పుడల్లా సువేందు ప్రస్తావిస్తున్నారు. ఆధారాలుగా ఉన్న వీడియోలను బయటపెడుతున్నారు.