దేశమంతా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి జేజేలు పలుకుతోంది. బిజెపి సారధ్యంలోని ఎన్డీఏ కొతమి మూడోసారి విజయకేతనం ఎగరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి దశ ఎన్నికల పోలింగ్ జరిగిన తర్వాతే ఎగ్జిట్ పోల్ సర్వేలు విడుదల చేయాలి . ఇందుకు తగినట్లుగా జూన్ నెల ఒకటో తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత… దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ మీడియా సంస్థలు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి.
దేశం మొత్తం ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఏడు దశల ఎన్నికలు ముగియడంతో.. ఏ పార్టీకి, ఏ కూటమికి ఎన్నెన్ని సీట్లు దక్కుతాయన్న విషయంపై ఆయా సంస్థలు అంచనాలను ప్రకటించాయి. వీటిలో చాలా సంస్థల అంచనాలు ఓకే మాదిరిగా ఉన్నాయి.
పలు మీడియా, ఏజెన్సీలు పోలింగ్ సమయంలో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని వీటిని విడుదల చేశాయి.
దేశంలో మొత్తం 543 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. బీజేపీకే అన్ని సర్వే సంస్థలు పట్టం గట్టాయి. 300 స్థానాలకు పైగా ఎన్ డి ఎ కూటమి విజయం సాధిస్తుందని తేల్చి చెప్పాయి. ఇండియా కూటమి 140 నుంచి 155 స్థానాలకు పరిమితం అన్ని జాతీయ చానల్స్ పేర్కొన్నాయి
ప్రముఖ మీడియా సంస్థ రిపబ్లిక్ టీవీ ప్రకారం ఎన్టీఏ కు 353 – 368, ఇండియా కూటమి 118 – 133, ఇతరులు 43 – 48 గెలుచుకునే అవకాశం ఉంది.
మరో మీడియా సంస్థ NDTV విశ్లేషణ ప్రకారం.. ఎన్డీఏ కి 365, ఇండియా కూటమి కి 142, ఇతరులు కు 36 దక్కుతాయి
.న్యూస్ నేషన్ లెక్కల ప్రకారం ఎన్డీఏ కు 342-378, ఇండియా కూటమి కి 153-169 దక్కే అవకాశం ఉంది.
మొత్తం మీద దేశమంతా ఎన్డీఏ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోంది.