రాష్ట్రంలో అధికారం చేపట్టేది తామేనని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలను ఉత్తేజపరిచే సందేశం ఇచ్చారు అన్నామలై. ఈ సందర్భంగా టి. నగర్లోని పార్టీ కార్యాలయం కమలాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యాలయ సమీపంలోని గోడపై కమలం చిత్నాన్ని గీశారు. త్వరలో డీఎంకే నేతల అవినీతి చిట్టా విడుదల చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారిసంఖ్య 4 రెట్లు పెరిగిందని అన్నామలై అన్నారు.