
Supreme Court of India
50 వేలమందిని ఒకేసారి ఎలా వెళ్లగొట్టగలరు హల్ద్వానీకేసులో గురువారం స్టే ఇస్తూ సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య. అసలైతే హైకోర్టు తీర్పుకు అనుగుణంగానే అక్కడ ఆక్రమణదారులను తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు ఉత్తరాఖండ్ అధికారులు. అది రైల్వే ఆస్తి అని ఆ భూములను వెంటనే ఖాళీచేయించాలని డిసెంబర్ 26 రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది.
అంతకుముందే హల్ద్వానీని మరో షహీన్ భాగ్ చేయాలని అక్కడ వాలిపోయారు కొందరు వ్యక్తులు, కొన్న సంస్థలు. ఓ వర్గం మీడియా సైతం తోడైంది. వాళ్లలో ఎక్కువ ముస్లింలు కనుక మతపరమైన కోణంలో దాన్ని చూపే ప్రయత్నం చేశారు వామపక్షపార్టీలు. అక్కడున్నవాళ్లు ముస్లింలు అయినందునే బీజేపీ ప్రభుత్వం అణచివేస్తోందని ప్రచారం చేశారు. బాధితులకు ట్రైనింగ్ ఇచ్చిమరీ ఎమోషనల్ డ్రామాలు ప్లే చేయించారు. ఫలితం సుప్రీం కోర్టు స్టే.
https://twitter.com/LiveLawIndia/status/1610906622683148288?s=20&t=eVVteVHG1sjovfilCErv5g
అక్రమ ఆక్రమణల తొలగింపునకు ఆదేశించిన హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, అభయ్ ఎస్ ఓకాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. ఏడు రోజుల్లో 50,000 మందిని తరలించలేమని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. వాళ్లు ఏళ్ల తరబడి అక్కడ నివసిస్తున్నారని…మానవీయ కోణంలో చూడాలనీ అన్నారు.
ఈ సందర్భంగా ఏడాదిన్నర క్రితం ఇదే సుప్రీంకోర్టు ఇంచుమించు ఇలాంటి కేసులో చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం.
జూన్ 7, 2021న, హర్యానాలోని ఫరీదాబాద్లోని ఎకో-సెన్సిటివ్ ఆరావల్లి కొండల దిగువన ఉన్న ఖోరీ గావ్ అనే గ్రామంలోని అటవీ భూమిలో పేదలు నిర్మించుకున్న ఇళ్లను ఆరువారాల్లో తొలగించాలని ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆ ప్రాంతంలో 10 వేల ఇళ్ల కూల్చివేతపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ఆ ఉత్తర్వులు ఇచ్చింది. అటవీ భూముల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అప్పట్లో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. అటవీ స్థలాన్ని ఆక్రమించి నివసిస్తున్న దాదాపు లక్షమందిని అక్కడినుంచి తరిమేయాల్సిందేనని స్పష్టమైన తీర్పును ఇచ్చింది.
https://twitter.com/AskAnshul/status/1611004338809499648?s=20&t=hEDS9aw16dpOD61bUKb3-g
ఇప్పుడు హల్ద్వానీ కేసులాగానే అప్పుడు ఖోరీగావ్ కేసులోనూ అక్కడి కట్టడాలు తొలగిస్తే పెద్దఎత్తున జనం నిరాశ్రయులవుతారని పిటిషన్లు దాఖలయ్యాయి. వారికి పునరావాస హక్కు కల్పించాలని వారి తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా కోర్టు తిరస్కరించింది.
ఇప్పటికే వారికి సమయం ఇచ్చామని..అది అటవీ భూమి అని….మరోచోట పునరావాసం ప్రభుత్వమే చూసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటి పిటిషన్లను విచారిస్తున్నప్పుడు, జస్టిస్ ఎం ఖాన్విల్కర్ ఇలా వ్యాఖ్యానించారు, “మీ పౌర హక్కుల కంటే పర్యావరణం చాలా ముఖ్యం. మీ పౌర హక్కులు పర్యావరణానికి లోబడి ఉంటాయి. ఒకప్పుడు అడవి అయితే, డీనోటిఫై చేయకపోతే అది ఎప్పుడూ అడవిగానే ఉంటుంది.” అని.
అయితే, ఇక్కడ హల్ద్వానీలో భారతీయ రైల్వే భూములను అక్రమంగా ఆక్రమించిన కేసులో సుప్రీంకోర్టు ఆక్రమణల తొలగింపు డ్రైవ్పై స్టే విధించింది. ఇక్కడ ఆక్రమణదారులు కనీసం మరోచోట పునరావాసం కోరడం లేదు. ఇతర పరిష్కారం కూడా చూపమనడం లేదు. ఆ రైల్వే భూములపై హక్కు మాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దానికి దేశ వ్యతిరేక మీడియా, వాపమక్షుల కూటమి మద్దతుగా నిలుస్తున్నాయి.