వెంకటేశ్వరుడు సుందర కశ్మీరంలోనూ కొలువుదీరనున్నాడు. అక్కడ అత్యద్భుతంగా తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమవుతోంది. వచ్చే 18 నెలల్లో కశ్మీర్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తికానుందని టీటీడీ ప్రకటించింది.
టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మితమవుతున్నాయి. ఇక భూతల స్వర్గం కశ్మీర్లోనూ ఆలయ నిర్మాణం జరుగనుంది. ఇప్పటికే శంకుస్థాపన పూర్తయింది. కేవలం 18 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని దేవస్థానం ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వారణాసి, ముంబైలలో కూడా శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5 వందల శ్రీవారి ఆలయాలు కట్టనున్నారు. ధర్మప్రచారంలో భాగంగానే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఆలయాలు నిర్మిస్తున్నామన్న ఆయన …. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామన్నారు.