ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఆఫీసులో వాస్తుపరమైన మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జూబ్లీహిల్స్ లోని నివాసంలో రేవంత్ చాలా కాలంగా ఉంటున్నారు ఎక్కడి నుంచి పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాన్ని సాధించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కావడంతో భద్రతాపరంగా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చింది. ఇవి వాస్తు పరంగా తప్పు అని ఇంట్లో వాళ్ళు అభ్యంతరం చెప్పినా అప్పట్లో పట్టించుకోలేదు . కానీ ,, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు రేవంత్ నాయకత్వానికి బలమైన దెబ్బ తగలడంతో పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
దీంతో వాస్తు పండితుల్ని పిలిపించి ఇంట్లో మార్పులు చేపడుతున్నట్లు సమాచారం అలాగే కొత్త సచివాలయంలోని ముఖ్యమంత్రి అవంతిలోను మార్పులు చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇప్పటికే ఆరో అంతస్థు లో కొన్ని మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
అలాగే రేవంత్ కుటుంబానికి సంఖ్యల విషయంలోనూ సెంటిమెంట్లు ఎక్కువ. రేవంత్రెడ్డి కి 9ని అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. అందు కే కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 9కి పెంచారని గుర్తు చేస్తున్నారు. అన్ని వాహనాల నంబర్ ప్లేట్లపై 9 నంబర్ వచ్చేలా చూసుకున్నారని అంటున్నారు. వాస్తవానికి సీఎం తన కార్యాలయాన్ని సచివాలయంలో ని 9వ అంతస్థులోకి మార్చాలని భావించారట. ఈ మేరకు పలుమార్లు వెళ్లి పరిశీలించారని, అయితే సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాదని చెప్పడంతో విరమించుకున్నారని చర్చ సాగుతున్నది.
ఇక నలుపు రంగును సెంటిమెంట్గా భావిస్తుంటారని.. అందుకే కాన్వాయ్ని ప్రత్యేకంగా నలుపు రంగులోకి మార్పించారని చెప్పుకుంటున్నారు. వాస్తు మార్పులకు అనుగుణంగా ఇప్పటికే సచివాయలంలోకి రాకపోకల మార్గాన్ని కూడా మార్చారని అంటున్నారు.
బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పువైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని వినియోగించారు. వాస్తు మార్పుల్లో భాగంగా పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి వస్తున్నారని, ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వా రా బయటికి వెళ్లిపోతున్నారని సచివాలయ వర్గాలు తెలిపాయి.
మొత్తం మీద పార్లమెంట్ పలితాల తర్వాత వాస్తుపరమైన మార్పులు బలంగా చేపట్టినట్లు తెలుస్తోంది.