భీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. శాశ్వత వైద్య బెయిల్ కోసం వరవరరావు దాఖలు చేసిన పిటిషన్పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)కి సుప్రీంకోర్టు ఇవాళ అధికారిక నోటీసు జారీ చేసింది. జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలోని బెంచ్ తుది విచారణ కోసం కేసును ఆగస్టు 10కి వాయిదా వేసింది. కౌంటర్ అఫిడవిట్ను దాఖలు చేయడానికి ఆగస్టు 2 వరకు NIAకి సుప్రీమ్ కోర్టు సమయం ఇచ్చింది. దానికి తన రీజయిండర్ను దాఖలు చేయడానికి ఆగస్టు 8 వరకు వరవరరావుకు సమయం ఇచ్చింది. తుది విచారణ ఆగస్టు 10న చేపట్టనున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అప్పటివరకు యదాతథ స్థితిని కొనసాగించాలని జస్టిస్ యుయు లలిత్ ధర్మాసనం ఆదేశించింది.
Supreme Court posts regular bail plea of P Varavara Rao on medical ground in #BhimaKoregaon case for final hearing on August 10. Extends his interim bail till further orders. Notice issued to NIA.#VaravaRao pic.twitter.com/jlit5Wzulq
— Live Law (@LiveLawIndia) July 19, 2022
వరవరరావు ప్రస్తుతం మధ్యంతర వైద్య బెయిల్పై బయట ఉన్నారు, అతని భార్యతో కలిసి ముంబైలో నివసిస్తున్నారు. బీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా వరవరరావును మహారాష్ట్ర పోలీసులు 2018 ఆగస్ట్ 28న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.