తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ పరుగులు పెడుతోంది. ఆదివారం ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. దక్షిణభారతదేశంలో ఇది రెండో ట్రైన్ కాగా… తెలుగు రాష్ట్రాల మధ్య మొదటిది.
ఆదివారం మినహాయించి మిగిలిన ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. నిన్నటి నుంచే టిక్కెట్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచారు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఛైర్ కార్ టిక్కెట్ రూ.1720లు గా ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్కార్ ధర రూ.31,20లుగా ఉంది. ప్రయాణికుల కోరిక మేరకు రైలులో టిఫిన్లు, టీ, ఆహారాన్ని అందిస్తారు. దీనికి ఐఆర్టీసీ అదనంగా ఛార్జీలను వసూలు చేస్తుంది. టిక్కెట్ బుక్ చేసుకునేటప్పుడే ప్రయాణికులు ఆహారం వద్దా? లేదా? అన్నది తెలియజేయాల్సి ఉంటుంది. ప్రధాని ప్రారంభించే ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు.
.
నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్న ఈ ట్రైన్లో చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ చైర్కార్ కోచ్లు ఉన్నాయి. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వచ్చే రైలు నెంబర్ 20833 కాగా, సికింద్రాబాద్- విశాఖపట్నం రైలు నెంబర్ 20834గా నిర్ణయించారు. విశాఖ నుంచి సికింద్రాబాద్కు చైర్ కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ – విశాఖ చైర్ కార్ టికెట్ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.2485.
విశాఖ నుంచి సికింద్రాబాద్కు చైర్ కార్ టికెట్ ధర రూ.1,720, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర రూ.3,170గా ఉంది. అటు సికింద్రాబాద్ – విశాఖ చైర్ కార్ టికెట్ ధర రూ.1665, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.3,120గా నిర్ణయించారు. ఇక సికింద్రాబాద్ నుంచి విజయవాడ చైర్ కారు రూ.905గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.1775గా ఉంది. సికింద్రాబాద్ నుంచి రాజమండ్రికి చైర్ కారు రూ.1365గా, ఎగ్జిక్యూటివ్ క్లాస్ రూ.2485.
మరోవైపు ఈ రైలు రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. రాజమండ్రిలో 2 నిమిషాలు, విజయవాడలో 5 నిమిషాలు, ఖమ్మం, వరంగల్ స్టేషన్లలో ఒక్కో నిమిషం ఈ ట్రైన్ హాల్ట్ అవుతుంది. ఇందులో 14 ఏసీ ఛైర్ కార్లు, 2 ఎగ్జిక్యూటివ్ ఏసీ ఛైర్ కార్ కోచ్లు ఉన్నాయి. ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ రైలు ప్రతీ ఉదయం 5.45 గంటలకు వైజాగ్ స్టేషన్లో బయల్దేరి.. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్లో మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి మొదలై.. రాత్రి 11.30 గంటలకు విశాఖ చేరుతుంది.
ఎక్స్ప్రెస్ విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య ఉన్న 700 కిలోమీటర్లను కేవలం 8 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఈ రెండు నగరాల మధ్య ఇతర రైళ్లతో పోలిస్తే ఈ రైలు సుమారు 3 గంటల సమయాన్ని ఆదా చేస్తుండగా.. దురుంతో కంటే గంటన్నర వ్యవధి ముందే ఈ ట్రైన్ గమ్యస్ధానానికి చేరుతుంది. దురంతో 10 గంటలు, గరీబ్రధ్ ఎక్స్ప్రెస్ 11.10 గంటలు, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ 11.25 గంటలు, గోదావరి ఎక్స్ప్రెస్ 12.05 గంటలు, ఈస్ట్కోస్ట్ 12.40 గంటలు, జన్మభూమి ఎక్స్ప్రెస్ 12.45 గంటల్లో సికింద్రాబాద్ నుంచి విశాఖకు చేరుతాయి.
https://twitter.com/kishanreddybjp/status/1614661288935952384?s=20&t=Kyhcz0UArXnMZgUYytD79A