కేరళలో మొదటి వందేభారత్ రైలుకు పచ్చాజెండా ఊపి ప్రారంభించారు ప్రధాని నరేంద్రమోదీ.ర తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కాడ్, పతినందిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసడ్ గఢ్ జిల్లాల మీదుగా నడుస్తుందని పీఎంవో తెలిపింది. రైలు ప్రారంభానికి ముందు వందేభారత్ రైల్లోని విద్యార్థులతో ముచ్చటించారు. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, మహ్మద్ ఖాన్. సీఎం పినరయి విజయన్, శశిథరూర్ తో కలిసి ప్రధాని ఈ రైలును ప్రారంభించారు. అంతకుముందు అందులో ప్రయాణానికి సిద్ధమైన విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమం కోసం తిరువనంతపురం వచ్చిన మోదీకి బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు మార్గంలో ప్రయాణించిన మోదీకి బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొచ్చి వాటర్ మెట్రో సర్వీసును ప్రధాని ప్రారంభించారు. దిండిగుల్ పలానీ- పాలక్కాడ్ సెక్షన్ విద్యుదీకరణ పనులు, ఫస్ట్ డిజిటల్ సైన్స్ పార్కులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
തിരുവനന്തപുരത്ത് നിന്ന് കാസർഗോഡിലേക്കുള്ള കണക്റ്റിവിറ്റി വർദ്ധിപ്പിക്കുന്ന കേരളത്തിലെ ആദ്യത്തെ വന്ദേ ഭാരത് എക്സ്പ്രസ് ഫ്ലാഗ് ഓഫ് ചെയ്തു. pic.twitter.com/9QXpM5PUSR
— Narendra Modi (@narendramodi) April 25, 2023