2006లో వారణాసిలో సంకట మోచన్ మందిర్ వద్ద, బెనారస్ హిందూ యూనివర్సిటీ సహా మరి కొన్ని చోట్ల జరిగిన వరుస బాంబు పేలుళ్లలో 20 మందికి పైగా చనిపోగా 100 మందికి పైగా గాయ పడ్డారు. ఈ కేసులో విచారణ పూర్తి అయి ఘజియా బాద్ జిల్లా సెషన్స్ కోర్టు నిందితుడు వలిలుల్లాహ్ కి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితుడు బీద వాడు, కుటుంబ ఆధారం అతను ఒక్కడే, ఇప్పటికే 16 సం.లు జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి కోర్టు వారు శిక్షని జీవిత ఖైదుగా మార్చమని అతని తరుపు న్యాయవాది కోరాడు.
నిందితుడు తన పనికి పవిత్ర నగరం వారణాసి లో, హొలీ నెలలో, వివాహాలు ఎక్కువగా జరిగే కాలంలో, ఎప్పుడూ భక్తుల తాకిడి ఎక్కువ ఉండే సంకట మోచన్ మందిరం ఎంచుకున్నాడు. దాడిలో సంవత్సరన్నర ఆడ బిడ్డ కూడా చనిపోయింది.
అందుకని దీనిని అరుదైన సంఘటనగా భావించి ఈ శిక్ష ఖరారు చేసాం. హై కోర్ట్ అనుమతితో శిక్ష అమలు చేస్తాం అని జడ్జీ
తెలిపారు. ఇదే నిందుతుణ్ణి, ఈ బ్లాస్ట్ లో మరో అనుమానితుడని, ఇంకో 25 మంది అనుమానిత టెర్రరిస్టులను (వీరి చర్యలు వల్ల 43 మంది చనిపోయారు. వీళ్ళలో కార్గిల్ యుద్ధం జరిగేప్పుడు ట్రూపు మూమెంట్స్ చెప్పిన వాడు కూడా ఉన్నాడు) విడుదల చేయడానికి 2012 అఖిలేష్ సమాజ్వాదీ పార్టీ సెక్యూలర్ ప్రభుత్వం ప్రయత్నించింది. దానిపై ఒకరు అలహాబాద్ హై కోర్ట్ లో పిల్ కూడా వేశారు. హై కోర్ట్ బెంచ్ అఖిలేష్ ప్రభుత్వాన్ని తిడుతూ ఇప్పుడు విడుదల చేస్తారు, తరువాత పద్మభూషణ్ కూడా ఇస్తారా అని ప్రశ్నించి, దీని వల్ల దేశంలో తీవ్రవాదం పెరగదా అని అడిగింది.
అలా అప్పుడు హై కోర్టు అడ్డుపడిన వాడికే ఈ రోజు మరణశిక్ష విధించారు.
~ చాడా శాస్త్రి