పాకిస్థాన్ ఒకవైపు డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలను సరఫరా చేస్తుంటే… మరోవైపు ప్రజారోగ్యమే లక్ష్యంగా భారత్… తన డ్రోన్ల ద్వారా మారుమూల ప్రజలకు టీకాలు, అత్యవసర ఔషధాలను సరఫరా చేస్తోంది.
జమ్మూ సమీపంలోని అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో రవాణా సౌకర్యం అంతంతగా ఉన్న గ్రామాలకు డ్రోన్ల సహాయంతో కరోనా టీకాలను పంపిస్తోంది కేంద్రం.
ప్రధాన మంత్రి ఆదేశంతో… హార్ ఘర్ దస్తక్ (ఇంటింటికీ టీకా) కార్యక్రమ విజయవంతంగా అమలవుతోంది. తమవంతు భాగస్వామ్యంగా సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని CSIR (Council Of Scientific And Industrial Research) ఇందుకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది.