వైరస్ పై వ్యాక్సిన్ యుద్ధం ఆరంభం
ఉత్తరాయణ పుణ్యకాలంతో పాటే ఉత్తమమైన వ్యాక్సిన్ ను ప్రజలకు అందించే కార్యక్రమం కూడా భారతదేశంలో మొదలైంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకాకరణ్ అంటే వ్యాక్సినేషన్ మిషన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం ఉదయం పదిన్నర గంటలకు టీవీలో జాతినుద్దేశించి ప్రసంగించారు. టీకాకరణ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైదరాబాద్ నిమ్స్ లో గవర్నర్ తమిళిసై, గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ సీఎం జగన్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మొదటి దశలో కారోనా యోధులకు టీకా ఇస్తున్నారు. ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, ఆ తర్వాత సైనికులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది ఇతర అత్యవసర సేవల వారికి వ్యాక్సిన్ ఇస్తారు. అటు తర్వాత మొదటిదశలో 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలనేది ప్రాథమిక లక్ష్యం.
మార్చి 25వ తేదీని లాక్ డౌన్ ప్రకటించే సమయానికి మన దేశం పి.పి.ఇ కిట్ల కోసం దిగుమతులపై ఆధారపడేది. కానీ ఇప్పుడు అనేక దేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నది. పి.పి.ఇ. కిట్ల తయారీలో ప్రపంచంలో నంబర్ టూ స్థాయికి ఎదిగింది. అలాగే చవకగా వెంటిటేలర్ల తయారీకి పరిశోధనలు జరిగాయి. వాటిలో చాలా వరకు ఫలించాయి. కరోనాపై పోరాటంలో ప్రపంచం మొత్తం మీత అత్యుత్తమ దేశాధినేత నరేంద్ర మోడీ అని పలు అంతర్జాతీయ సర్వేల్లో తేలింది. భారతీయులే కాదు, విదేశాలకు చెందిన వారు కూడా మోడీ ది గ్రేట్ అని కితాబిచ్చారు. తాజాగా అమెరికన్ సంస్థ చేసిన సర్వేలో 75 శాతం అప్రూవల్ రేటింగ్ తో మోడీ మొదటి స్థానంలో నిలిచారు. లాక్ డౌన్ ద్వారా లక్షల మంది ప్రాణాలను కాపాడినందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా నరేంద్ర మోడీని మెచ్చుకున్నాయి. 21 లక్షల కోట్ల రూపాయల ఆత్మనిర్భర్ ప్యాకేజీ ద్వారా సహాయ ప్యాకేజీని ప్రకటించడం ద్వారా ఆపద సమయంలో మోడీ ప్రభుత్వం అవసరమైన వారికి అండగా నిలిచింది. మరే దేశంలోనూ లేని అతిపెద్ద సమస్య, వలస కూలీలను వారి ఇళ్లకు చేర్చడం. వారిని ఉచితంగా రైళ్లలో గమ్య స్థానాలకు చేర్చడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ పరీక్షలోనూ మోడీ సర్కార్ పాసైంది.
భారతదేశం కరోనా కాలంలో ప్రపంచానికే పెద్దన్న పాత్రను పోషించింది. దాదాపు 800 ఏళ్ల తర్వాత మళ్లీ విశ్వగురువుగా మారింది. కరోనాపై పోరాటానికి పలు దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు మోడీ సలహాలు తీసుకున్నారు. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి అయితే మోడీకి అభిమానిగా మారారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ , ఇతర మందులను భారతదేశం అమెరికా సహా దాదాపు 65 దేశాలకు సరఫరా చేసింది. పైగా కరోనాపై ఎలా పోరాడాలో మోడీ మాటలతోనూ, చేతలతోనూ ప్రపంచానికి మార్గదర్శనం చేశారు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాపై పోరాటంలో విఫలమయ్యారని విమర్శలు ఎదుర్కొన్నారు. పరువు నిలుపుకోవడానికి మోడీ సహాయం కోరారు. మోడీ పంపిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను చూపించి, కొంతలో కొంత నయం అనిపించుకున్నారు. మోడీకి పదే పదే ధన్యవాదాలు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడు ఈ మాత్రలను పంపాలని మోడీని కోరుతూ రామాయణంలోన సంజీవని పర్వత ఘట్టాన్ని ఉటంకించారు. అంటే మోడీని హనుమంతునితో పోల్చాలని ఆయన ఉద్దేశం కావచ్చు. భారతదేశంలో మాత్రం కొందరు ప్రతిపక్ష నేతలు ఈ విషయంలోనూ బురద చల్లుడు రాజకీయాలు చేశారు. చేస్తున్నారు.
మొత్తం మీద రెండు మేడిన్ ఇండియా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కరోనాపై పోరాటాన్ని ఒక పోటీగా భావిస్తే ఇందులో ఏక పక్షంగా విజయం సాధించిన వరల్డ్ చాంపియన్ భారత దేశమే. మోడీ లాంటి ప్రధాన మంత్రి ఉంటే అది సాధ్యమే. అసలు మోడీ లాంటి ప్రధాని మనకెందుకు లేడు అని కూడా కొన్ని దేశాల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు. చివరకు పాకిస్తాన్ లో కూడా మోడీని మెచ్చుకునే ట్రెండ్ పెరిగింది. దటీజ్ మోడీ.