కరోనా మహమ్మారిని ఎదుర్కొందికి వాక్సిన్ ఒకటే మార్గం,అది కూడా పూర్తి రక్షణ ఇస్తుంది అని కాదు, కానీ కొంత వరకు రక్షణ ఇస్తుంది. వాక్సిన్ తీసుకున్నా కూడా మాస్క్ లు పెట్టుకోవడం, సామాజిక దూరం పాటించడం మొ. తప్పని సరి అని ప్రపంచవ్యాప్తంగా డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా చెప్పారు.
దానికి అనుగుణంగానే మన దేశంలో కూడా రెండు దేశీయ కంపెనీలు వాక్సిన్ తయారు చేసి నిపుణుల కమిటీ అనుమతులు పొందిన తరువాత జనవరి 19న మొదటి సారిగా వాక్సిన్ ప్రోగ్రాం దేశంలో మొదలు పెట్టారు. అప్పటికి దేశంలో కరోనా ఉధృతి బాగా తగ్గింది.,రోజుకి లక్షల్లో వుండే కేస్ లు వేలల్లోకి వచ్చేశాయి.
సరే.. ఇంక సామాన్య ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి మన ప్రతిపక్షాలు, మేధావులు దిగిపోయారు.
* కరోనా తగ్గిపోయింది. ధారవి వంటి ముంబై మురికివాడల్లోనే హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది. ఇంక కరోనా తగ్గిపోతే వేక్సిన్ కొనేవారు ఉండరు. అందుకని వాక్సిన్ అమ్ముకుందుకు ఫార్మా కంపెనీలు కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కు అయి కరోనా సెకండ్ వేవ్ అని రూమర్లు పెడుతున్నారు ..
** వాక్సిన్ వేసుకున్నా మాస్క్ లు పెట్టుకోవాలట, మిగతా జాగ్రత్తలు అన్ని తీసుకోవాలట..
అటువంటి అప్పుడు వాక్సిన్ తీసుకున్నా ఉపయోగం ఏమిటి?
*మోడీకి వాక్సిన్ అంటే భయం. మిగతా దేశాల్లో ప్రధానులు ముందు తీసుకొని ప్రజలకు భరోసా కల్పిస్తే ఇక్కడ మోడీ తను తీసుకోకుండా ప్రజల్లో అనుమానాలు పెంచాడు (అదే అతనే ముందు తీసుకొని ఉంటే మోడీకి ఎంత స్వార్ధమో చూడండి డాక్టర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కాకుండా వాక్సిన్ తీసుకుందికి తానే ముందు రెడీ అయిపోయాడు అని విమర్శించేవారు)
అని ఇలా సామాన్య ప్రజల్లో అనుమానాలు భయాలు రేకెత్తించడంతో జనవరి 19న అధికారికంగా వాక్సిన్ కార్యక్రమం మొదలు అయినా మార్చి నెలాఖరు వరకు నత్త నడక నడిచింది. ఒక వాక్సిన్ వయల్ లో సైజ్ బట్టి 10 నుండి 20 డోస్ లు వుంటాయిమ్ ఒకసారి వయల్ ఓపెన్ చేశాక నాలుగు గంటలలో అది పూర్తిగా ఉపయోగించాలి. లేకపోతే ఆ బాటిల్ లో మిగతా వాక్సిన్ వృధా అయిపోయినట్లే.
జనాల్లో అనుమానాలు రేకెత్తించడం వల్ల టీకా సెంటర్లు అన్ని సుమారు రెండున్నర నెలలు ఈగలు తోలుకున్నాయి. సగం వాడి వృధా అయిన చాలా వాక్సిన్ వాయిల్స్ వృధా అయిపోయాయి. ఆఖరుకు మెడికల్ సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బంది కూడా వాక్సిన్ తీసుకుందుకు మొహం చాటేశారు.
తయారు అయిన వాక్సిన్స్ స్టాక్స్ ఏం చేసుకోవాలి? కొన్ని చిన్న దేశాలకు ఫ్రీగా సప్లై చేస్తే కొన్ని మరికొన్ని పై దేశాలకు అమ్మారు.
ఎందుకు అయినా మంచిది అని నవంబర్ నెలలోనే మోడీ మరో మూడు కంపెనీలకు వాక్సిన్ తయారు చేసే పనిలో ఉండమని చెప్పాడు. అవి –
1.జెన్నోవా బయో ఫార్మాస్యూటికల్స్ పుణే
2. బయలాజికల్ కంపనీ అదే BE Ltd, Hyd
3. Dr రెడ్డి లాబ్స్, హైదరాబాద్.
అసలు దేశంలో తయారు చేస్తున్న రెండు కంపెనీల వాక్సిన్ కే డిమాండ్ లేకపోతే మరో మూడు కంపెనీలు తయారు చేసే వాక్సిన్ గాని
విదేశాల నుండి ఇంకా ఎక్కువ వాక్సిన్స్ దిగుమతి చేసుకుని ఏం చేస్తారు?
ముందుగా ప్రజల్లో అవగాహన పెంచి వాక్సిన్ తీసుకునే వారి సంఖ్య పెరిగితే అప్పుడు ఎక్కువ సప్లై గురించి ఆలోచించవచ్చును అని ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేసింది.
కానీ ఈ లోగానే అమెరికా యూరోప్ ఫార్మా లాబీ మన దేశ ఫార్మా రంగానికి దెబ్బతీసే విధంగా మోడీ ప్రభుత్వం విదేశాల నుండి వాక్సిన్ ఎందుకు దిగుమతికి ఒప్పుకోవడం లేదు అని రాహుల్ గాంధీ మొదలుకొని సెలెబ్రెటీ జర్నలిస్టులు అందరి చేతా ట్వీట్స్ మీద ట్వీట్స్ పెట్టించారు.
ప్రభుత్వం మాకు విదేశాల నుండి వాక్సిన్స్ దిగుమతికి అభ్యంతరం లేదు కానీ మా దేశీయ వాక్సిన్స్ కు ఇక్కడ ఎటువంటి పరీక్షలు తరువాత అనుమతులు ఇచ్చామో అదే విధంగా ఆ కంపనీ లు కూడా అనుమతులు పొందాలి అని చెప్పింది. మా దేశాల్లో మరియి FDI అనుమతులు పొందాము కాబట్టి ఆ ప్రొసీజర్ మేం ఫాలో కాము భారత్ లో మా వాక్సిన్ అమ్ముకుందుకి నేరుగా అనుమతించాలి అని ఆ ఫార్మా కంపెనీలు అడిగితే ప్రభుత్వం ఒప్పుకోలేదు.
ఈ ఇబ్బందులు దృస్థిలో ఉంచుకొని భారత్ ప్రభుత్వం నవంబర్ నెలలోనే రష్యా వాక్సిన్ స్పుత్నిక్ పై ట్రయల్స్ చెయ్యడానికి రెడ్డీ లాబ్స్ కి అనుమతి ఇచ్చింది జనవరిలో స్పుత్నిక్ స్టేజ్ 3 ట్రయల్స్ కి కూడా అనుమతి ఇచ్చి ఈ వారంలో మార్కెట్ లోకి విడుదల చేయడానికి అనుమతులు ఇచ్చింది. మరి ఇదే ప్రాసెస్ అమెరికా యూరోప్ కంపెనీలు ఎందుకు ఒప్పుకోలేదు? అలా ఒప్పుకుంటే అవి భారత్ దేశీయ కంపెనీలతో టై అప్ పెట్టుకొని వాటికి కూడా వ్యాపారం షేర్ చెయ్యాలి.
ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారం నుండి కేస్ లు పెరగడం మొదలు అయిన దగ్గర నుండి జనాలు పోలో మని వాక్సిన్ సెంటర్స్ కి పోవడం మొదలు పెట్టారు. అమెరికా యూరోప్ దేశాలు వాక్సిన్ రా మెటీరియల్ ఎగుమతులపై నిషేధం విధించాయి. కోవిడ్ షీల్డ్ యూకే కంపనీ అస్ట్ర జేంకా కంపనిది. ఆ కంపనితో గల ఒప్పందం ప్రకారం తయారు అయిన కోవిడ్ షీల్డ్.లో.కొన్ని తిరిగి యుకె కి ఎగుమతి చెయ్యాలి.
మనదేశంలో సిరం ఇన్స్టిట్యూట్ కోవిడ్ షీల్డ్, కోవాక్సిన్ తయారు చేస్తున్నాది. ప్రస్తుతం నెలకు 6-6.50కోట్ల డోస్. లు తయారు చేస్తున్నాది. ముడిపదార్ధాల కొరత రావడంతో ఉత్పత్తి కూడా పెంచ లేకపోతున్నారు.
ఇప్పుడు కేస్ లు పెరుగుతున్నాయి కాబట్టి నోవావాక్స్ మరియు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల వాక్సిన్ దేశంలో తయారు చేసే కంపెనీలకు అనుమతులు వేగవంతం చేస్తున్నారు.
ముందుగా కేంద్ర ప్రభుత్వం అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆగస్టు నెలకు 30.కోట్ల మందికి ఇద్దాం అని ప్రణాళిక రచించారు. ముందు అనుకున్నట్లు ముందు రెండు నెలల్లో.కూడా ఇప్పుడు వాక్సిన్ తీసుకున్నట్లు తీసుకొని ఉంటే ఈ సరికే ఒక 20.కోట్ల మంది వరకు వాక్సిన్ తీసుకునే వారు ఉండేవారు. కానీ ప్రతీదీ రాజకీయం చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఇంతకీ సోనియా రాహుల్ వాక్సిన్ తీసుకుని దేశ ప్రజలకు భరోసా కల్పించారా? 45 సం.ల వారికి కూడా ఇప్పుడు అనుమతి ఇచ్చారు కాబట్టి 50 సం.ల యువరాజు వాక్సిన్ తీసుకున్నాడా?
చాడా శాస్త్రి…