లంగాణలో ఇప్పతెటివరకు వైద్య కళాశాలలు, టీవీవీపీ ఆస్పత్రుల్లోనే టీకాలు వేశామని నేటినుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా వాక్సినేషన్ చేపట్టనున్నట్టు తెలంగాణ వైద్యారోగ్యమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కోవిడ్ వాక్సినేషన్ పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. 45 ఏళ్లు నిండిన వారికి ఇప్పుడు వేస్తున్నామని విధిగా అఅందరూ వేయించుకోవాలని కోరారు. మాస్కులు ధరించాలని… భౌతిక దూరం పాటించాలని ఆయన సూచించారు.