ఉత్తరాఖండ్ మాజీ మంత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. తుపాకీతో కాల్చుకుని మాజీమంత్రి రాజేంద్ర బహుగుణ ప్రాణాలు తీసుకున్నారు. తన కుమార్తెను వేధించారంటూ ఆయన సొంత కోడలే కేసు పెట్టడంతో మనస్తాపం చెందారు రాజేంద్ర. చనిపోయేముందు పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112 కు కాల్ చేసి తాను చనిపోబోతున్నట్టు చెప్పారు. ఇంటిపైనున్న ట్యాంక్ పైకి ఎక్కి వాళ్లకు ఫోన్ చేశారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపించినా ఆ వెంటనే చేతిలోకి తుపాకీని గుండెలమీదకు గురిపెట్టుకుని పేల్చుకున్నాడు.దీంతో రాజేంద్ర అక్కడికక్కడే చనిపోయాడు. మనవరాలిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆయన కోడలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో అవమానభారంతో ఆయనీ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. రాజేంద్ర బహుగుణ కుమారుడి ఫిర్యాదుతో ఆయన కోడలు, ఆమెతండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు.