రాజకీయనాయకులపై ఒక్కొక్కరు ఒక్కోరకంగా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తుంటారు. ఇక డెహ్రాడూన్ కు చెందిన ఓ బామ్మ రాహుల్ గాంధీపై ఆయన కుటుంబంపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంది. తన యావత్ ఆస్తిని ఆయనకే వీలునామాగా రాసింది. 50 లక్షల విలువైన తన స్థిరాస్తులతో పాటు…..10 తులాల బంగారం తన తదనంతరం రాహుల్ గాంధీకే చెందాలంటూ వీలునామా రాసింది 78 ఏళ్ల పుష్ప ముంజియల్. రాష్ట్ర పీసీసీ చీఫ్ ప్రీతమ్ సింగ్ నివాసానికి వెళ్లి తాను రాసిన వీలునామా పత్రాన్ని స్వయంగా అందచేసింది పుష్ప.దేశం కోసం రాహుల్ గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని…రాహుల్ అవసరం ఈ దేశానికి ఉందని అందుకే తన యావదాస్తిని అతనికి చెందేలా రాశానని చెప్పింది.