గణతంత్ర దినోత్సవ సంబరాల్లో మోదీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సరికొత్త సంప్రదాయ వస్త్రధారణలో ఆయన హాజరయ్యారు. ముందు నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర సైనికులకు నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన ఉత్తరాఖండ్ సంప్రదాయ ప్రత్యేక టోపీ ధరించారు. ఆయన మెడలో మణిపూర్ ప్రత్యేక స్టోల్ కనిపించింది. ఆయన ధరించిన టోపీపై సోషల్మీడియాలో చర్చ నడుస్తోంది. ఆయన ధరించిన టోపీ హిల్ క్యాప్. అందులో బ్రహ్మకమలం కనిపిస్తోంది. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం. శుభచిహ్నంగా వారు దాన్ని భావిస్తారు.