ఉత్తరాఖండ్ పాఠశాల పాఠ్యాంశాల్లో భగవద్గీత, రామాయణం తోపాటు వేదాలను చేర్చనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ధన్ సింగ్ రావత్ సోమవారం తెలిపారు. జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ అని ఆయన తెలిపారు. పాఠశాలల్లో గీతను ప్రవేశపెట్టడమే కాకుండా ఉత్తరాఖండ్ చరిత్రను కూడా విద్యార్థులకు బోధిస్తామని మంత్రి తెలిపారు.
ఈ ప్రకటనతో, గీతను పాఠశాల విద్యలో చేరుస్తామని తెలిపిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్ రెండవ రాష్ట్రంగా అవతరించింది. గతంలో గుజరాత్ ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాల పాఠ్యాంశాల్లో గీతను చేర్చనున్నట్లు ప్రకటించింది. కర్ణాటక కూడా భగవద్గీత బోధనను పాఠశాల పాఠ్యాంశాల్లో ప్రవేశపెట్టాలని ఆలోచిస్తోంది.