ఓవైపు అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో ధ్వంసం చేస్తూనే…ప్రార్థనామందిరాల్లోని అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తోంది యోగీ ప్రభుత్వం. ఇప్పటివరకు యూపీలో వివిధ ప్రార్థనామందిరాల నుంచి 53 వేల 942 లౌడ్ స్పీకర్లు తొలగించారు. 60,295 లౌడ్ స్పీకర్ల సౌండ్ను స్థాయీ ప్రమాణాలకు అనుగుణంగా తగ్గించినట్టు రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలంటూ సీఎం ఏప్రిల్ 24న అధికారులను ఆదేశించారు. అంతకుముందు అన్ని జిల్లాలనుంచి నివేదికను కోరారు. మతపెద్దలతో చర్చించి…వారితో సమన్వయం చేసుకుంటూ చర్యలకు దిగారు పోలీసులు, ఇతర యంత్రాంగం.