భారత్ కు చెందిన పలు ట్విట్టర్ ఖాతాలను ఆధీనంలోకితీసుకున్నారు హ్యాకర్లు. అయితే నిపుణులు, అధికారులు అవి హ్యాక్ అయిన కొన్ని నిమిషాల్లోనే పునరుద్ధరించారు. హ్యాక్ అయిన అకౌంట్లలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అధికారిక అకౌంట్, పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధికారిక అకౌంట్లు ఉన్నాయి.
గతంలో యోగీ వ్యక్తిగత ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. హ్యాక్ చేసిన వెంటనే ఎన్ఎఫ్టీ ప్రకటనలను వరుసగా షేర్ చేశారు హాకర్లు. అంతే కాదు యూపీ సర్కార్, పంజాబ్ కాంగ్రెస్ అకౌంట్లలో ఉన్న ప్రొఫైల్ పిక్స్, ఇతర వివరాల్ని మార్చేసి ఎన్ఎఫ్టీ ట్వీట్ ను పిన్ చేశారు. ఇక అంతకుముందు ఓరోజు కూడా యూపీ సీఎంవో కార్యాలయ అఫీషియల్ ట్వీట్ నూ అలాగే హాక్ చేసిన సైబర్ నేరగాళ్లు దాదాపు 5 వందల ట్వీట్లు చేశారు. నాలుగు గంటల తరువాత పునరుద్ధరించిన నిపుణులు కంప్లైంట్ చేశారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)