స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ ఓడిపోయారు. పనాజీ నుంచి ఉత్పల్ పోటీచేశారు. 713 ఓట్లతో అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన అటానాసియో మోన్సెరేట్ చేతిలో ఓటమిపాలయ్యారు.
“స్వతంత్ర అభ్యర్థిగా ఇది మంచి పోరాటం, నేను ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నికల పోరుతో సంతృప్తి చెందాను, కానీ ఫలితం కొద్దిగా నిరాశపరిచింది” అని ఉత్పల్ పారికర్ అన్నారు..