భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ వెంట నటిచారు నటి ఊర్మిళమతోంద్కర్ 2019లో కాంగ్రెస్ చేరిన ఉర్మిళ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి 2020లో శివసేనలో చేరారు. ఇప్పుడు రాహుల్ యాత్రలో ప్రత్యక్షమయ్యారు. క్రీమ్-కలర్ సంప్రదాయ కాశ్మీర్ గౌను, బీనీక్యాప్ ధరించి రాహుల్ వెంట నడుస్తున్న ఊర్మిళయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ రచయిత పెరుమాళ్ మురుగన్, జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వికార్ రసూల్ వానీ, మాజీ మంత్రి అబ్దుల్ హమీద్ కర్రా కూడా చేతుల్లో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని రాహుల్ వెంట నడిచారు.సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన యాత్ర గురువారం పంజాబ్ నుంచి జమ్మూకశ్మీర్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈనెల 30తో రాహుల్ జోడో యాత్ర ముగియనుంది.