గతంలో ప్రభుత్వంలో ఉండగా యుపిఎ ముఠా సభ్యులు సెక్యూలరిజం పేరుతో ఓట్లు కోసం ఎంత ప్రమాదకర ఆట అడారో గమనించండి…
ప్రపంచ వ్యాప్తంగానూ దేశంలో జరిగిన పలు బాంబు దాడులకు యుపిఎ ముఠా సభ్యులు ఏనాడూ వాటికి ఇస్లాం టెర్రరిజం అని గాని గ్రీన్ టెర్రరిజం అనే పదాలు ఉపయోగించలేదు.
కానీ యూపీఎ పాలనలో హిందూ టెర్రరిజం లేదా సాఫ్రాన్ (కాషాయ ఉగ్రవాదం)టెర్రర్ పదాలు తరుచుగా, విరివిగా ఉపయోగించే వారు.
కారణం తెలుసా? ఇదిగో చదవండి.
యుపిఎ ప్రభుత్వం లో ఉండగా అప్పటి హోమ్ సెక్రటరీ గా పనిచేసిన RVS మణి రిటైర్ అయ్యాక “హిందూ టెర్రర్” అనే ఒక పుస్తకం రాశారు… దానిలో అప్పుడు ప్రభుత్వ సమయంలో జరిగిన సంఘటనలు గురించి వివరించారు.
యూపీఎ ప్రభుత్వ హయాంలో తరుచుగా బాంబు దాడులు జరుగుతూ ఉండడం, దానిలో దేశ, విదేశీ ముస్లిం ల పాత్ర బయట పడుతూ, వారి సమాజానికి చెడ్డపేరు వస్తూ ఉండడం, తమ సెక్యూలర్ ఓటు బ్యాంక్ కి ఇబ్బంది కలుగుతూ ఉండటంతో దానిని కౌంటర్ చెయ్యడానికి యుపిఎ పెద్దలు అయిన రాహుల్, చిదంబరం, షిండే, దిగ్విజయ్ సింగ్ మొదలగు వారు దేశంలో హిందూ టెర్రరిజం పెరిగిపోతోంది అని ప్రకటనలు ఇచ్చేవారు. దానికి రుజువులు కోసమా అన్నట్లు అప్పటికే జరిగిన కొన్ని బాంబు దాడులు ముస్లిమ్స్ చేసినట్లు ప్రాధమిక రుజువులు దొరికినా అవి హిందూ సంస్థలు చేసినట్లు గా కేసులు మార్చమని తమపై వత్తిడి చేశారు అని RVS మణి తన పుస్తకం ” హిందూ టెర్రర్” లో రాశారు.
మీకు గుర్తు వుండే ఉంటుంది. అప్పట్లో సంఝౌత ట్రైన్ బ్లాస్ట్, మాలేగాం, మక్కా మసీదు బాంబు దాడుల సమయంలో ముందుగా దొరికిన ఆధారాలు బట్టి కొందరి ముస్లిం యువకులను అరెస్ట్ చేశారు. కానీ కొన్ని రోజులకు అకస్మాత్తుగా దర్యాప్తు సంస్థలు ఆ దిశగా విచారణ అపి, వారు కాదు అని చెప్పి స్వామి ఆసీమానంద్, కల్నల్ పురోహిత్, సాధ్వి ప్రజ్ఞలను అరెస్ట్ చేసి సుమారు 8సం. లు విచారణ సాగదీస్తూ కనీసం ఛార్జ్ షీట్స్ ఫైల్ చెయ్యకుండా జైలులో ఉంచారు. తరువాత కోర్టులు అందరికి బెయిల్ ఇచ్చాయి.
మొన్న మాలేగామ్ బాంబు పేలుడు కేసు విచారణ సమయంలో ఒక సాక్షి మాట్లాడుతూ అప్పటి మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్ అధికారి పరమ్ బీర్ సింగ్ ఈ మలేగామ్ బాంబు దాడి వెనుక యోగి ఆదిత్యనాధ్ కొందరు RSS ప్రముఖులు ఉన్నట్లు వారి పేర్లు చెప్పమని తనని టార్చర్ చేశారు అని NIA కోర్ట్ కి తెలిపాడు. ఈ పరమ్ బీర్ సింగ్ ఎవరో కాదు..ముంబై మాజీ పోలీసు చీఫ్. తప్పుడు కేసులో అర్ణబ్ అని అరెస్ట్ చేసిన వాడు. వందల కోట్లు బెదిరింపు వసూళ్ల కేసులో పట్టుబడి,అనేక కేసులు ఎదుర్కొంటూ, సస్పెండ్ అయ్యి, నెలల పాటు తప్పించుకు తిరుగుతూ అరెస్ట్ కాకుండా సుప్రీంకోర్టు దగ్గర ముందస్తు రక్షణ పొంది ఉన్నాడు. 26/11ముంబై దాడుల సమయంలో కసబ్ దగ్గర దొరికిన ఫోన్ ఈయన మాయం చేసాడు అని కూడా ఒక ఆరోపణ.
అంటే యుపిఎ ప్రభుత్వం హిట్ లిస్ట్ లో అప్పటి నుండే మోడీ, అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ లు వున్నారు అని తెలుస్తోంది.
అదే కర్మఫలం అంటే ఇప్పుడు ఆ ముగ్గురే దేశంలో బాగా పవర్ ఫుల్ అయి ఆ యుపిఎ సెక్యూలర్ ముఠాకు చమటలు పట్టిస్తున్నారు.
ఒక పక్క లేని హిందూ టెర్రరిజానికి ప్రచారమిస్తూ అరెస్టు కాబడ్డ అసలు టెర్రరిస్టులను విడిచిపెట్టేవారు. 2010 లో యూపీఎ ప్రభుత్వం దేశంలో వివిధ జైళ్లలో ఉన్న 25 మంది కరుడు గట్టిన పాక్ టెర్రరిస్టులను goodwill gesture అంటే స్నేహపూర్వక సంబంధాల కోసం విడుదల చేసింది. వీళ్ళల్లో ముఖ్యులు ఎవరో తెలుసా? 1999 లో వాజపేయి హయాంలో విమానం హై జాక్ చేసి జైషే చీఫ్ అజర్ మసూద్ ని విడిపించుకుపోయినప్పుడు వారు విడుదల కోరిన మరో వ్యక్తి పేరు ‘లతీఫ్’. ఈ లతీఫ్ జమ్మూకాశ్మీర్ జైల్లో ఉంటే 2001 పార్లమెంటు పై దాడి తరువాత భద్రతా కారణాల దృష్ట్యా వీడిని 2002లో వారణాసి జైలుకి తరలించారు.
2010 లో ఇలా స్నేహపూర్వకంగా విడుదల చేసిన 25 కరుడుగట్టిన పాక్ ఉగ్రవాదుల్లో ఈ లతీఫ్ ఒకడు. ఇంకా దారుణం ఏమిటంటే 2016లో పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడి చేసిన నలుగురు ఉగ్రవాదుల వెనుక సూత్రధారి ఈ లతీఫ్ అని NIA నిర్ధారణకు వచ్చింది.
అంటే యుపిఎ ప్రభుత్వం రాజకీయ ఓటు బ్యాంకు అవసరాల కోసం ఒక వైపు లేని హిందూ ఉగ్రవాదాన్ని నిరూపించడానికి పథకాలు రచిస్తూ కొందరు హిందువులను ఉగ్రవాదులుగా ముద్రవేసి అరెస్టులు చేస్తూ మరో వైపు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీని, అమిత్ షాను కేసుల్లో ఇరికించడానికి ఎన్కౌంటర్స్ లో చనిపోయిన ఉగ్రవాదులు ఇశ్రాట్ జహాన్, సొరబుద్దీన్ లను వెనకేసుకు రావడం, సంవత్సరాల నుండి జైళ్లలో ఉన్న ఇస్లామిక్ టెర్రరిస్టులను పాక్ తో మంచి సంబంధాల కోసం అనే నెపం తో ఊరికే విడిచిపెట్టడం చేశారు…
దేశ భద్రత, దేశ ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి వీరు ఆడిన ఓటు బ్యాంకు ఆటల వల్లే 2004-14మధ్య దేశంలో భద్రతా వ్యవస్థ నాశనం అయిపోయి అన్ని ప్రముఖ నగరాల్లో పెద్ద పెద్ద బాంబు దాడులు జరిగి వందల మంది చనిపోయారు. దీనికి ఎవరిది పాపం? ఎవరు బాధ్యత వహిస్తారు?
ఒక వైపు బీజేపీని మతతత్వం పెంచుతోంది అని కూసే వాళ్లకు మరి సెక్యూలర్ పార్టీలు అని చెప్పుకునే ఈ పార్టీలు చేసే దారుణాలు కనిపించవా? ఏనాడు అయినా ప్రముఖ తెలుగు జర్నలిస్టులు వీటి మీద “కొత్త పలుకులు” “ఇండియా గేట్” లు రాశారా? రాయరు. కారణం? వారి వామపక్ష భావజాలం దేశ శ్రేయస్సు కంటే బీజేపీని వ్యతిరేకించాలి అని చెపుతుంది ఏమో వారి మనసాక్షికే తెలియాలి.
ఉగ్రవాదుల దాడుల్లో సామాన్య ప్రజలు చనిపోకుండా, దేశ ఆస్తులు నాశనం అయిపోకుండా ఈ 7 సం. లలో ఇంత గొప్పగా మేనేజ్ చేస్తున్న దేశ అంతర్గత భద్రత గురించి వీరి ఎర్ర పెన్నులు కనీసం ఒక వాక్యం అయినా రాసాయా? రాయవు. రాస్తే సెక్యూలరిజం ప్రమాదంలో పడిపోతుంది.
అందుకే సెక్యూలరిజం పేరుతో నిర్లజ్జగా ఈ ప్రముఖ జర్నలిస్టులు అందరూ అవినీతి, కుల కుటుంబ పార్టీలను నిర్లజ్జగా సమర్థిస్తూ బోలెడు చిత్ర విచిత్ర వ్యాసాలు రాస్తారు.
ఇప్పుడు కేంద్రంలో సెక్యూలర్ ప్రభుత్వం అధికారంలో లేదు కదా! అందుకే ఇప్పుడు హిందూ ఉగ్రవాదం పేరుతో సెక్యూలర్ పార్టీలు మొదలుపెట్టిన మరో భయంకరమైన ఆట గురించి మరో పోస్టులో తెలుసుకుందాం.
Courtesy :- Chada Shastry



