అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బీహార్తో ఉన్నసరిహద్దు సమస్యలకు ముగింపు పలకాలని యోగీ సర్కారు నిర్ణయించింది. బీహార్ను ఆనుకుని ఉన్న ఏడు గ్రామాలను ఆ రాష్ట్రానికే బదిలీ చేయనున్నారు. ఖుషినగర్ జిల్లాలోని ఏడు గ్రామాలు బాఘా జిల్లా కింద బీహార్కు వెళ్తాయి.. బాఘాలోని ఏడు గ్రామాలను ఉత్తరప్రదేశ్లోకి తీసుకోనున్నారు. యుపి, బీహార్ల సరిహద్దుల కారణంగా పరిపాలనాపరమైన చిక్కుముడుల కారణంగా ఆయా గ్రామాలు అభివృద్ధిలో వెనకబడిపోతున్నాయి.
ఈ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపి… కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపనున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే గ్రామాల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా…డివిజన్ కమిషనర్ జిల్లా కలెక్టర్ కుందన్ కుమార్కు లేఖ రాసినట్లు సమాచారం. యూపీ సరిహద్దులో ఉన్న బీహార్లోని ఏడు గ్రామాలకు ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. గండక్ నది మీదుగా పిప్రాసి బ్లాక్లోని బరి స్థల్, మంఝరియా, మజారియా ఖాస్, శ్రీపత్నగర్, నైన్హా, భైసాహి , కట్కి గ్రామాలకు వెళ్లేందుకు యూపీ మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. ఇప్పుడిక ఈ ప్రధాన సమస్యతో సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలోని మార్చాహ్వా, నర్సింగపూర్, శివ్పూర్, బాల్గోవింద్, బసంత్పూర్, హరిహర్పూర్, నరైనాపూర్ గ్రామాలదీ ఇదే పరిస్థితి . బీహార్లోని బాఘా జిల్లాకు ఆనుకుని ఉన్న ఈ గ్రామాలకు వెళ్లాలంటే యూపీ, నేపాల్ సరిహద్దు గుండా వెళ్లాలి. ఈ గ్రామాలకు చేరుకోవడానికి అదనంగా 25 నుంచి 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. బీహార్ సరిహద్దులోని ఖుషీనగర్ జిల్లాలోని ఏడు గ్రామాలు బాఘలో, బాఘలోని ఏడు గ్రామాలు ఉత్తరప్రదేశ్లోని ఖుషీనగర్ జిల్లాలో చేరడంతో భూ వివాదాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. అదే సమయంలో రైతులకు వ్యవసాయ పనులు కూడా సులభతరం అవుతుంది. అధికారిక, పాలనాపనులకోసం కిలోమీటర్ల దూరం వెళ్లే బాధ ఆయా గ్రామాల ప్రజలకు తప్పుతుంది.
ఇక ఉత్తరాఖండ్ తో 21 ఏళ్లుగా ఉన్న సమస్యలుకూడా పరిష్కారించుకున్నారు యోగీ. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, యోగీ మధ్య కీలక సమావేశం జరిగింది.
ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా జలవనరులు, ఉమ్మడి సరిహద్దులు, ఇంధనం వంటి అంశాలపై చర్చించారు. నవంబర్ 2000లో ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తరాఖండ్ విడిపోయినప్పుడు కొంత భూమి, కాలువల సమస్య అలాగే ఉంది.
మరిన్ని వివరాలను తెలియజేస్తూ, 5,700 హెక్టార్ల భూమిపై జాయింట్ సర్వే చేసి ఎవరి ఆధీనంలో ఉన్న భూభాగాన్ని ఆరాష్ట్రంగా తీసుకుంటామని ధామీ తెలిపారు.
రూర్కీలోని ఎగువ గంగా కాలువ వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రారంభించేందుకు యూపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉత్తరాఖండ్ కోర్టులో కొనసాగుతున్న కేసులను యూపీ ప్రభుత్వం ఉపసంహరించుకోనుంది. 15 రోజుల తర్వాత అన్ని ఆస్తి వివాదాలన్నింటినీ పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రులిద్దరూ ప్రకటించారు.