
మన దేశంలో ఒక పెద్ద ప్రాజెక్టు మొదలుపెట్టి పూర్తి చేయడానికి దశాబ్దాల కాలం పడుతోంది. దీనివల్ల ఆ ప్రాజెక్ట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే దక్కవలసిన ఫలితాలు దశాబ్దాలు ఆలస్యంగా అందుతున్నాయి.
ఇలా ప్రోజెక్టు లు ఆలస్యం కావడానికి పాలకుల, అధికారుల ఆలసత్వం, నిర్లక్ష్యం, నిధుల కొరత కొన్ని అనివార్య ఆలస్యాలు అంటే భూసేకరణ ఇబ్బందులు మొ..వి.

అయితే పాలకులకు ప్రాజెక్ట్ ఎలాగైనా తొందరగా పూర్తి చేయాలి అని చిత్త శుద్ధి ఉంటే ఎంత ఇబ్బంది కరమైన సమస్యలకు అయినా అధికారులు పరిష్కారాలు కనుక్కుంటారు అన్న దానికి ఉదాహరణే ఉత్తరప్రదేశ్ లో సరయు ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఇక వివరాలు లోకి వెళ్తే..
ఉత్తరప్రదేశ్ పూర్వాంచల్ ప్రాంతానికి ఇరిగేషన్ సదుపాయాలు లేవు అని 1970 లో అనుకుని 1978లో ఈ 6623 కి.మీ సరయూ ప్రాజెక్ట్ ₹78 కోట్ల ప్రోజెక్టు కాస్ట్ తో ప్రారంభించారు. 6200 గ్రామాల్లో 25,021 హెక్టార్ల భూ సేకరణ జరగాలి. ఈ ప్రాజెక్ట్ వల్ల సుమారు 30 లక్షల మంది రైతులు ఉపయోగపడ్తారు అని అంచనా. 2017 లో యోగి ప్రభుత్వం వచ్చేసరికి అంటే సుమారు 39 సం. లకి సుమారు 50% పనులు మాత్రమే పూర్తి అయ్యాయి. ఇంకా కొన్ని చోట్ల చాలా క్లిష్టమైన భూసేకరణ సమస్యలు ఉండటంతో ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది.
మోడీ తాను వచ్చేసరికి పెండింగ్ ఉన్న అన్ని ప్రోజెక్టుల మీద శ్రద్ధ పెట్టినట్లే ఈ ప్రాజెక్ట్ మీద కూడా దృష్టి సారించి ప్రొజెక్గ్ వీలయినంత తొందరలో పూర్తి చేయమని యోగికి ఆదేశాలు ఇచ్చారు. యోగి కూడా మోడీ లాగే పని రాక్షసుడు కాబట్టి అధికారులను పిలిచి భూసేకరణ లోఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో కనుక్కున్నారు. అధికారులు 1300 వరకు ఇబ్బందులు చెప్పి మిగతావి ఎలాగైనా పరిష్కరించ వచ్చు కానీ ఈ నాలుగు సమస్యలు మరీ కష్టం అని చెప్పారు.

1. ఒక 0.113 హెక్టార్ల భూమి ఒక యావజ్జివ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి చెందింది. మొత్తానికి అతన్ని అమ్మకానికి ఒప్పించారు కానీ రిజిస్ట్రేషన్ ఎలా? అందుకోసం ఒక రోజు సబ్ రిజిస్ట్రార్ ని జైల్లో ఆఫీస్ ఓపెన్ చేయమని కోరి పని పూర్తి చేశారు ఆ ల్యాండ్ కి మార్కెట్ వాల్యూ కి 4 రేట్లు ₹10.50లక్షలు పే చేశారు.
2. మరొక కేసు ల్యాండ్ ఓనర్ దుబాయ్ లో ఉన్నట్లు తెలిసింది. అతనికి ఇద్దరు భార్యలు. ఒక అమ్మకానికి ఓకె. మరొకరు కాదు. వాలిద్దరిని ఒప్పించేసరికి అధికారులకు చుక్కలు కనిపించాయి. మొత్తానికి వాళ్ళు ఒప్పుకున్నా కానీ అతను ల్యాండ్ రిజిస్ట్రేషన్ కి ఈ రోజు రేపు అంటూ సం. టైం తిన్నాడు. ఆఖరికి అతనికి టూ అండ్ ఫ్రొ టిక్కెట్లు కొని పంపిస్తే రిజిస్ట్రేషన్ కి వచ్చాడు.
3. ఇంకో 0.117 హెక్టార్ల భూమి ఖబరిస్తాన్ అంటే ముస్లిమ్స్ సమాధి క్రింద వాడుకుంటున్నారు. సున్నితమైన సమస్య కాబట్టి ఇప్పటి వరకు ఎవరూ దానిపై గట్టిగా ప్రయత్నం చేయలేదు. అది ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని ఆ మౌల్వీలు అంటే ఆ పక్కనే ఉన్న ఒక హిందువును బతిమాలి ఈ స్థలం బదులు అది తీసుకోమని మౌల్వీలను ఒప్పించడానికి 3 సం. లు పట్టింది.
4. ఇంకో చిన్న బిట్ 20 సం. లుగా తగవుల్లో ఉంది. దానికి సంబంధించిన రెవిన్యూ రికార్డ్స్ ఫైల్ ఎక్కడో పోయింది. దాని కోసం వెతికి ఆ సమస్య పరిష్కరించడానికి సం. లు పట్టింది.
ఇంకా చాలా మంది భూములు ఉన్న వాళ్ళు ఎక్కడికి ఎక్కడికో పనులు కోసం వలసలు పోతూ ఉండటంతో వారు హిందువులు అయితే హిందూ పండుగులప్పుడు వారి ఇళ్లకు పోయి వచ్చారేమో కనుక్కోవడం ముస్లిమ్స్ అయితే వారి పండుగలప్పుడు వారు వచ్చారేమో అని రెగ్యులర్ గా విచారణ చేసే వారు అధికారులు.
ఇలా మొత్తం మీద సమస్యలు అన్ని ఒక్క 4 సం. లలో పరిష్కరించబడి మొన్న నవంబర్ 2021లో మోడీ చేత ఈ ప్రోజెక్టు ప్రారంభించబడింది.
అంటే 1970 లో అనుకున్న ప్రాజెక్ట్ 1978 లో కాగితం మీదకు వచ్చి సుమారు 40సం.లలో 50% మాత్రమే పూర్తి అయిన ప్రాజెక్ట్ ఒక్క నాలుగు సం. లలో మిగతా 50%పనులు పూర్తి చేయగలిగారు అంటే యోగి కి ఉన్న చిత్త శుద్ధి కార్యదీక్షత ఎటువంటిదో ఒక పెద్ద ఉదాహరణ.
లక్షల మంది రైతులు ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రయోజనం పొందుతున్నారు.
ఇలా దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్న ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే కాదు ఇటువంటి చాలా ప్రాజెక్టు లు మోడీ హయాంలో పూర్తి ఆవుతున్నాయి. 1978లో ₹78 కోట్లు అనుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు పూర్తి అయ్యే సరికి ₹10,000కోట్లు అయింది. ప్రోజెక్టులు ఆలస్యం అవడం అంటే ప్రజలపై భారం పడడమే.

రాష్ట్రాన్ని ఇంత బాగా పరిపాలిస్తున్నా అయినా యోగి యుపి తగలెతున్నాడు, ఈ సారి యోగి దిగి కుల, కుటుంబ అవినీతి అఖిలేష్ పార్టీ గద్దె నెక్కితే బాగుండును అని ఉదారవాద సెక్యూలర్ మాఫియా కోరిక.
చూద్దాం యుపి ప్రజలు మన సెక్యూలర్ మేధావుల కంటే తెలివైన వారో కాదో…
….చాడా శాస్త్రి..