రాష్ట్రవ్యాప్తంగా మతపరమైన ప్రదేశాల నుంచి 11,000 లౌడ్ స్పీకర్లను తొలగించారు యూపీ పోలీసులు. మార్గదర్శకాల ప్రకారం 35,000 లౌడ్ స్పీకర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించారు.
ఏప్రిల్ 30లోగా లౌడ్ స్పీకర్ల విషయంలో అన్ని రాష్ట్రాలు యూపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ను అనుసరించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. దాని ఆధారంగా యూపీ పోలీసులు ఈ చర్య తీసుకోనున్నారు.
లక్నో నుంచి గరిష్ట సంఖ్యలో 2,395 లౌడ్ స్పీకర్లు తొలగించారు. గోరఖ్పూర్ లో 1,788, వారణాసిలో 1,366, మీరట్ లో 1,204, ప్రయాగ్రాజ్ లో 1,172 సహా బరేలీలో 1070 లౌడ్ స్పీకర్ లను తీసివేశారు.
లౌడ్ స్పీకర్ల వాల్యూమ్ను తగ్గించడంలో లక్నో అగ్రస్థానంలో ఉంది. వాల్యూమ్ తగ్గించిన నగరాల్లో లక్నోలో 7,397, బరేలీలో 6,257, మీరట్ లో 5,976, గోరఖ్పూర్ లో 5561 సహా వారణాసిలో 2,417 ఉన్నాయి.
మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్ స్పీకర్లను తొలగించి, అనుమతించదగిన పరిమితుల్లో వాటి వాల్యూమ్ను సెట్ చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా డ్రైవ్ చేపట్టామని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ అన్నారు.
ఆ చర్యలో భాగంగా, 10,923 లౌడ్ స్పీకర్లను తొలగించామని, 35,221 ఇతర లౌడ్ స్పీకర్లను ఇప్పటివరకు అనుమతించదగిన పరిమితులకు వాల్యూమ్ ను తగ్గించామని చెప్పారు.
లౌడ్ స్పీకర్లకు నిర్దిష్ట డెసిబెల్ చేయమన్న హైకోర్టు ఆర్డర్ ను మేము అనుసరిస్తున్నామని …
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జిల్లా అధికార యంత్రాంగానికి పంపించామనీ అన్నారు. దీని పరిశీలనకు కమిటీని ఏర్పాటు చేశారు.
మతపరమైన ప్రదేశాలలో చాలా వరకు లౌడ్ స్పీకర్లను అమర్చినందున మత పెద్దలతో కూడా మాట్లాడుతున్నామన్నారు.
ఈ డ్రైవ్కు సానుకూల స్పందన లభించిందనీ చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలపై చర్చించేందుకు గత వారం సీఎం యోగి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తమకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు, స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే తమకు నచ్చిన పద్ధతిలో పూజలు చేసేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సీఎం యోగి అన్నారు. మైక్ లను ఉపయోగించగలిగినప్పటికీ, ధ్వని మతపరమైన ప్రాంగణంలో నుంచి బయటకు రాకుండా చూసుకోండి. ఇతర వ్యక్తులు ఎటువంటి సమస్యలను ఎదుర్కోకూడదు. ”అని ఆయన ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత, హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన చాలా మంది మత పెద్దలు లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించడానికి అంగీకరించారు. మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వాల్యూమ్ ను తగ్గించిన వాటిలో మొదటిది. ఆలయ ప్రాంగణంలోని భగవత్ భవన్లో లౌడ్స్పీకర్లో ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి గంటపాటు వాయించే ప్రసిద్ధ ‘మంగళాచరణ్ ఆరతి’ని ప్రసారం చేయకూడదని వారు నిర్ణయించుకున్నారు.
మరోవైపు లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని తగ్గించాలని అన్ని సున్నీ మసీదులకు ఆదేశాలు జారీ చేసినట్లు మౌలానా ఖలీద్ రషీద్ ఫరంగి మహలీ తెలిపారు. “మేము ఇక్కడ ఉన్న అన్ని మసీదులను ఆవరణ నుంచి బయటకు రాకుండా చూసేందుకు లౌడ్ స్పీకర్ల శబ్దాన్ని పరిమితం చేయాలని ఆదేశించాం.”అని తెలిపారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)