క్రింద ఫోటోలు చూడండి..అవి ఏ విదేశీ రోడ్లు కావు.. మన దేశంలోనే వెనకబడ్డ రాష్ట్రంగా పేరుపొందిన ఉత్తరప్రదేశ్ లో నిర్మించిన బుందేల్ ఖండ్ హై వే ఫోటోలు.
దేశంలో బుందేల్ ఖండ్ ప్రాంతం సుమారు దేశానికి మధ్య భాగంగా ఉంది అని చెప్పుకోవచ్చు. దీనిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్ లో ఉంటే కొంత భాగం మధ్యప్రదేశ్ లో ఉంది. ఈ ప్రాంతాల్లో ఖనిజ సంపద, వ్యవసాయం బాగానే ఉన్నా దేశంతో సరి అయిన కనెక్టివిటీ లేక అంటే సరి అయిన రవాణా సదుపాయాలు లేక బాగా వెనుకబడిపోయి ప్రజలు బీదవారిగా మిగిలిపోయారు.. ఏయే ప్రాంతాల పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతాయో అక్కడ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్స్ ఊపు అందుకుంటాయి. అలాగే ప్రత్యేక బుందేల్ ఖండ్ రాష్ట్రం కోసం ఆందోళనలు చేశారు.



యూపీలో అఖిలేష్ ప్రభుత్వం పోయి 2017 ఫిబ్రవరిలో యోగి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ మార్చి నెలలోనే బుందేల్ ఖండ్ ఎస్ప్రెస్ హై వే నిర్మిస్తామని యోగి హామీ ఇచ్చారు.
ఈ 296 కి.మీ బుందేల్ ఖండ్ ఎస్ప్రెస్ హై నాలుగు వరుసలు గా భవిష్యత్తులో 6 వరుసలు చేసే విధంగా ల్ దక్షిణాన చిత్రకూట్ జిల్లా నుండి మొదలు అయి ఉత్తరాన ఇటవా జిల్లా దగ్గర ఇప్పటికే నిర్మించి ఉన్న ఆగ్రా-లక్నో ఎస్ప్రెస్ ని కలిపి ఈ ప్రాంత ప్రజలకు అటు లక్నో వెళ్లాలన్నా ఇటు ఢిల్లీ వెళ్ళాలి అన్నా డైరెక్ట్ హై వే మీద వెళ్లే సదుపాయం కలుగచేస్తుంది. ఈ హైవే వల్ల ఈ ప్రాంత ప్రజలకు చాలా గంటల ప్రయాణ సమయం కలిసి వస్తుంది.
ఇది 7 జిల్లాల ద్వారా వెళ్తుంది. 296 కి.మీ పొడవైన రోడ్డు నిర్మాణ పనులను 6 ప్యాకేజీలుగా విభజించి 4 వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. మొత్తం 4 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు (ROB), 14 పెద్ద వంతెనలు, 268 చిన్న వంతెనలు, 18 ఫ్లై ఓవర్లు, 6 టోల్ ప్లాజాలు , 7 ర్యాంప్ ప్లాజాలు మరియు 214 అండర్పాస్లు నిర్మించబడ్డాయి. భూమి ధర కాకుండా దీని నిర్మాణ వ్యయం సుమారు ₹7,766 కోట్లు. మొత్తం వ్యయం సుమారు ₹15 వేల కోట్లు.
ఇది ఎంత తొందరగా నిర్మించారు అంటే ఏప్రిల్ 2017 లో అనుకుంటే, నవంబర్ కి పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేసి, భూసేకరణ మొదలుపెట్టి ఆగస్ట్ 2019కి 90% సేకరణ పూర్తి చేసి ఫిబ్రవరి 2020 న శంఖుస్థాపన చేసి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. కరోనా వల్ల మధ్యలో ఆపేసినా ఇంత పెద్ద ప్రాజెక్ట్ రికార్డు టైంలో పూర్తి అయింది.
ఈ హై వే అన్ని విధాలుగా పూర్తి అవ్వడంతో
ప్రధాని మోడీ ఈ రోజు అధికారికంగా ప్రారంభోత్సవం చేస్తున్నారు.
కరువులతో అల్లాడుతున్న ఇక్కడ బీద రైతులకు భూ సేకరణ ద్వారా ₹2200 కోట్లు వెంటనే చెల్లించారు.
ఈ ప్రాంత రైతులు ఈ హై వే నిర్మిస్తూ ఉండడం వల్ల చాలా ఆనందంగా వున్నారు. కారణం ఒక్క సారిగా వారి భూమి ధరలు రెండింతలు అయ్యాయి. అలాగే రైతులు ఇప్పటి వరకు రవాణా సదుపాయం లేక హార్టికల్చర్ పంటలు వైపు మొగ్గు చూపడం లేదు. ఇప్పుడు ఈ హైవే వల్ల మేం వేరే పంటల వైపు మొగ్గు చూపించి ఆర్ధికంగా లాభపడతాం అని రైతులు అంటున్నారు.
…చాడా శాస్త్రి…