ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లౌడ్ స్పీకర్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. మతపరమైన ప్రదేశాల్లో అక్రమంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లను తొలగించాలని ఆదేశించింది. చట్టవిరుద్ధంగా ఉన్నవాటిని, సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించాలని.. అందుకు నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర హోంశాఖ పోలీసులకు సూచించింది. ఏప్రిల్ 30వ తేదీలోగా అన్ని స్థలాల జాబితాను తయారు చేసి పంపాలని ఆదేశించింది. ప్రతి జిల్లా నుంచి డివిజన్ కమిషనర్ల పంపే నివేదికను సమీక్షించి ఆయా మతాల పెద్దలతో చర్చించి అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగిస్తారు. అనుమతితో మాత్రం మత పరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు పెట్టవచ్చని… అయితే ప్రాంగణం నుంచి శబ్దం బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కొత్తగా లౌడ్ స్పీకర్లకు అనుమతులు ఇవ్వబోమని అధికారులు స్పష్టం చేశారు. అంతకుముందే ప్రయాగరాజ్ ఐజీ సుప్రీం ఆదేశాల మేరకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్య లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం ఉండేలా చూడాలని కలెక్టర్లను కోరారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)