ప్రగతిభవన్లా కాక రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై అన్నారు. ఇప్పుడు ప్రొటోకాల్ గురించి అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని గతంలో తనకు ప్రొటోకాల్ పాటించారా అని ప్రశ్నించారామె. ప్రొటోకాల్ పాటించాలని కోరుకునే మీరు గవర్నర్ ను అయిన తన విషయంలో ప్రోటోకాల్ పాటించని అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె అన్నారు. రాజ్ భవన్ గౌరవాన్ని దిగజార్చే చర్యలు మానుకోవాలి ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో ఎవరికి సమస్య వచ్చినా ప్రగతిభవన్ కు కాక రాజ్ భవన్ కు రావాలనుకుంటున్నారని… రాజ్ భవన్ తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయని అన్నారు. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పలు అంశాలపై మాట్లాడారు.