కరోనాతో దేశం యుద్ధం చేస్తున్న ఆ సమయంలో దేశసేవలో బాధ్యత నిర్వర్తిస్తున్న ఈ యువతి
కేంద్రమంత్రి మన్ సుఖ్ మాడవీయ తనయ దిశ . 22 ఏళ్ల దిశ వడోదరా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నారు. ప్రస్తుతం ఆమె నగరంలోని కోవిడ్ ఆస్పత్రిలో ఇంటర్న డాక్టర్్ గా సేవలందిస్తున్నారు. అయితే ఈ సమయంలో బాధ్యతలో ఉన్న తన కుమార్తెను చూస్తుంటే గర్వంగా ఉందని మాండవీయ
ట్విట్టర్ ద్వారా తెలిపారు.
‘దిశ నా కుమార్తె అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది.. దేశానికి నీ సేవలు అవసరం..నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటావనే నమ్మకం నాకుంది. నా బిడ్డకు భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. పీపీఈ కిట్ లో విధులకు సిద్దంగా ఉన్న ఆమె ఫొటోను అందుకు జత చేశారు.
గుజరాత్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న మన్ సుఖ్ మాండవీయ రసాయన, ఎరువుల శాఖమంత్రిగా కేంద్రకేబినోట్లో కొనసాగుతున్నారు.