కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖామంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ఓ ట్వీట్ పెద్దదుమారాన్నే రేపింది. 1100 మంది బంగ్లాదేశీ రోహింగ్యాలందరికీ వసతి కల్పిస్తున్నాం…EWS ఫ్లాట్లు వారికి కేటాయిస్తున్నాం… 24 గంటలపాటు వారికి భద్రత కల్పిస్తున్నాం అన్నది ఆ ట్వీట్ సారాంశం. అంతేకాదు రోహింగ్యాల రక్షణ తమ బాధ్యత అన్నట్టు ఆయన ట్వీట్ చేశారు. శరణార్థులను భారత్ ఎప్పుడూ అక్కున చేర్చుకుంది.. ఇప్పుడూ మరో కీలక నిర్ణయం తీసుకున్నాం. రోహింగ్యా శరణార్థులందరినీ డిల్లీలోని బక్కర్వాలా ప్రాంతంలోని EWS ఫ్లాట్లకు తరలించనున్నాం. వారికి ప్రాథమిక సౌకర్యాలు, UNHCR IDలు, అలాగే 24 గంటల పాటు ఢిల్లీ పోలీసు రక్షణను అందజేస్తామని ట్విట్టర్ వేదిగ్గా తెలిపారు.
https://twitter.com/HardeepSPuri/status/1559722354292375554?s=20&t=iGAcJppOQsTy3RiF7QRGUA
దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా రగడ మొదలైంది. మంత్రి ట్వీట్ పై నిరసన తెలుపుతూ నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్మీడియాలో సైతం కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతూ మోదీని. బీజేపీని తప్పుబడుతూ ట్రోలింగ్ లు. అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం ఏంటని నిలదీశారు చాలామంది.దశాబ్దాలనాడు తరిమివేతకు గురైన కశ్మీరీ హిందువులు బతుకులింకా రోడ్డుమీదే ఉన్నాయని…ఎన్నోఏళ్లనాడు పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వలస వచ్చిన హిందువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని..వారిని వదిలి రోహింగ్యాలకు సకల సౌకర్యాలు, రాజభోగాలు ఏంటని హిందూసంఘాలు మండిపడ్డాయి. గతంలో రోహింగ్యాలను తరమిస్తామంటూ 2014 ఎన్నికల ముందు మోదీ అన్న మాటల్ని, రెండేళ్ల క్రితం పార్లమెంట్లో అమిత్ షా అన్న మాటల్ని ప్రస్తావిస్తూ..ఆ వీడియోలను షేర్ చేశారు చాలామంది. ఇప్పటికిప్పుడు రోహింగ్యాలపైన ప్రేమేంటని..ఇక్కడ ఇబ్బంది పడుతున్న హిందువుల సంగతేంటని మండిపడ్డారు. రోహింగ్యా హాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండింగ్ లో ఉంది. ఇక వీహెచ్పీ సైతం కేంద్రం నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ ప్రకటన విడుదల చేసింది. రోహింగ్యాలకు నివాసం కల్పించడం కాదు భారత్ నుంచి తరిమికొట్టండని… వీహెచ్పీ అధికార ప్రతినిధి అలోక్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశాయి. వీహెచ్పీ మాత్రమే కాక దేశంలోని హిందూ సంస్థలు, బీజేపీ మద్దతుదారులు సైతం ఇదే మాటన్నారు.
https://twitter.com/VHPDigital/status/1559817863367602176?s=20&t=iGAcJppOQsTy3RiF7QRGUA
మంత్రి ట్వీట్ వివాదాస్పదమై చర్చలు సాగుతుండగానే హోంమంత్రిత్వ శాఖ వరుస ట్వీట్లు చేసింది. దీంతో రోహింగ్యా అక్రమ విదేశీయులకు ఢిల్లీలో EWS ఫ్లాట్లు ఇవ్వబోమని స్పష్టం చేసింది. రోహింగ్యా అక్రమ విదేశీయుల గురించి కొన్ని మీడియా విభాగాలలో వార్తలు వచ్చాయని గుర్తు చేస్తూ… న్యూఢిల్లీలోని బక్కర్వాలాలో రోహింగ్యా అక్రమ వలసదారులకు EWS ఫ్లాట్లను అందించడానికి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే MHA ఇప్పటికే MEA ద్వారా సంబంధిత దేశంతో రోహింగ్యాల బహిష్కరణ విషయాన్ని తీసుకున్నందున.. రోహింగ్యా అక్రమ విదేశీయులు ప్రస్తుత ప్రదేశంలోనే కొనసాగేలా చూడాలని GNCTDని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. చట్టప్రకారం అక్రమ విదేశీయులను బహిష్కరించే వరకు వారిని డిటెన్షన్ సెంటర్లో ఉంచాలని పేర్కొంది. హోం మంత్రిత్వ శాఖ. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుత ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్ గా ప్రకటించలేదు. వెంటనే ఆ పని చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే హోంశాఖ ప్రకటన తరువాత కూడా మంత్రి హర్దీప్ సింగ్ పురి చేసిన ట్వీట్ ఇంకా అలాగే ఉండడం గమనార్హం.
https://twitter.com/HMOIndia/status/1559832452876881921?s=20&t=3gRv8-gDow3xk7c2DHcZVQ