జమ్మూకశ్మీర్లో భద్రతా పరిస్థితులపై కేంద్ర హోం మంత్రి అమిత్షా అత్యున్నత స్థాయి అధికారుల సమావేశం జరిపారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో మరణించిన కుటుంబాలను పరామర్శించేందుకు అమిత్షా జమ్మూ వెళ్లారు. రాజౌరి జిల్లాలో పర్యటించి భద్రతా దళాలతో అక్కడి వాస్తవ పరిస్థితిని సమీక్షించారు షా. ఇటీవల రౌజారిలో జరిగిన రెండు ఉగ్ర ఘటనల్లో ఆరుగురు మృతిచెందారు. జనవరి 1, 2 తేదీల్లో చోటుచేసుకున్న ఈ ఘటనల్లో ఇద్దరురు పిల్లలతో సహా ఆరుగురు పౌరులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. జనవరి 1న ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. రాజౌరీ అప్పర్ డాంగరీ గ్రామంలో జనవరి రెండో తేదీ ఉదయం ఉగ్రవాదులు అమర్చిన ఐఈడీ పేలడంతో ఇద్దరు పిల్లలు మృతి చెందగా, మరి కొందరు గాయపడ్డారు.