యూనిఫాం సివిల్ కోడ్ (UCC) ఆలోచన రాజ్యాంగ విరుద్ధమని, మైనారిటీలకు వ్యతిరేకమని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) అంది. యూసీసీ ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని తెలిపింది.
https://twitter.com/hmksrahmani/status/1518995450602221568?s=20&t=UdcJbFJ7Et0YMVHmpCHgJQ
ప్రాథమిక హక్కులలో భాగంగా పౌరులు తమ మతం ప్రకారం జీవించడానికి రాజ్యాంగం అనుమతించిందని AIMPLB ప్రధాన కార్యదర్శి హజ్రత్ మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ
అన్నారు. అదే హక్కు కింద, మైనారిటీలు, గిరిజనులకు వారి ఆచారాలు, నమ్మకాలు, సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక చట్టాల రూపకల్పన జరిగిందన్నారు.
మైనారిటీ, మెజారిటీ కమ్యూనిటీల మధ్య పరస్పర విశ్వాసాన్ని కొనసాగించడంలో పర్సనల్ లా బోర్డు సహాయపడుతుందని మౌలానా పేర్కొన్నారు. దేశంలో ఉన్న అసలైన సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాల తోపాటు కేంద్ర ప్రభుత్వం UCC గురించి మాట్లాడుతున్నాయన్నారు. “ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సహా కేంద్ర ప్రభుత్వం యూనిఫాం సివిల్ కోడ్ను ఆమోదించడం కేవలం కాలాతీత వాక్చాతుర్యం.. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించడం చేతకాక ఇలాంటి వాటిని ముందుకేస్తున్నారని అన్నారు.
యూసీసీ ఆలోచన ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని ద్వేషం, వివక్ష లతో కూడిన ఎజెండాను ప్రోత్సహించడానికి యూనిఫాం సివిల్ కోడ్ ను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఈ రాజ్యాంగ వ్యతిరేక చర్య ముస్లింలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన అన్నారు.
యుసిసిపై చర్చలను రహ్మానీ ఖండిస్తూ,హ… అలాంటి ప్రణాళికలను మానుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఉత్తరాఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలో యుసిసిపై డ్రాఫ్ట్ ను సిద్ధం చేయడానికి ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిన సమయంలో AIMPLB ఈ ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్తో పాటు, ఉత్తరప్రదేశ్లోని బిజెపి ప్రభుత్వం కూడా యూసీసీ అమలును పరిశీలిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు.
భోపాల్లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ప్రకటనలో యూసీసీని ప్రస్తావించారు.
“CAA , రామ మందిరం, ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాక్లు ఇప్పటికే పరిష్కారమయ్యాయని.. ఇప్పుడు ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్పై దృష్టి సారిస్తుంది ” అని అన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)