యునెస్కో వారసత్వ జాబితాలోని నీలగిరి పర్వత రైలు సేవలను పునరుద్ధరించారు. దక్షిణ రైల్వే, రైలుకు అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్లను ప్రవేశపెట్టింది. ఈ రైలును టాయ్ రైలు అని పిలుస్తారు. కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయం వద్ద పశ్చిమ కనుమల పాదాల నుంచి నీలగిరిలోని ప్రసిద్ధ హిల్ రిసార్ట్ పట్టణం ఊటీకి ప్రయాణీకులను ఈ రైలు తీసుకువెళుతుంది. ప్రయాణించే దారిలో చిన్న జలపాతాలు, ప్రవాహాలు, మనోహరమైన పర్వత దృశ్యాలు, అలాగే సాహసోపేతమైన సొరంగాలు, వంతెనలు అబ్బురపరుస్థాయి. ఈ రైలు ఇప్పటికీ సంప్రదాయ ఆవిరి లోకోమోటివ్లచే నడుస్తోంది. రైలులో ప్రయాణించడానికి వేలాది మంది పర్యాటకులు ఆసక్తిచూపుతారు. ఈ ప్రత్యేకమైన రైలులో అనేక సినిమాలు కూడా చిత్రీకరించారు.కోవిడ్ కాలంలో రైలును నిలిపేశారు.
https://twitter.com/airnewsalerts/status/1519906136509775872?s=20&t=4gLQR5GNdRH59tdfIXOWdQ