కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బ్రిటన్ పర్యటనలో బిజీబిజీ గా ఉన్నారు. పదిరోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రాహుల్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. భారత్ లో ప్రజాస్వామ్యం లేదని దేశం బయట ఆయన చేసిన వ్యాఖ్యలను బీజేపీ సహా పలువురు తప్పుబడుతున్నారు. తన ఫోన్లో పెగాసస్ ఉందని, ఇంకా ప్రముఖుల ఫోన్లు నిఘాలో ఉన్నాయనీ రాహుల్ వ్యాఖ్యానించారు. ఇక రాహుల్ బ్రిటన్ పార్లమెంట్లో కూడా ప్రసంగించనున్నారు. మార్చి 6 న ఆయన బ్రిటన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ, ప్రవాసాంధ్రులతోనూ ఆయన ఇష్టాగోష్టి నిర్వహిస్తారు.