రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న UK ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం గుజరాత్లోని వడోదర సమీపంలోని హలోల్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ భారీ పరికరాల తయారీ సంస్థ JCB ఫ్యాక్టరీని సందర్శించారు. బిజెపి నియంత్రణలో ఉన్న ప్రభుత్వాలు, మునిసిపాలిటీలలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఇళ్లు, దుకాణాలను ధ్వంసం చేయడంపై పెరుగుతున్న వివాదాల మధ్య బుల్డోజర్ కర్మాగారానికి ప్రధాని బోరిస్ సందర్శించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఉదయం అహ్మదాబాద్లో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో సమావేశం తరువాత జాన్సన్జేసీబీ ఫ్యాక్టరీని సందర్శించారు. వారివురూ దేశంలో శక్తి పరివర్తన, వాతావరణ చర్యలు, ఏరోస్పేస్ సహా రక్షణ సహకారం వంటి కీలక విషయాలపై చర్చించారు.
జాన్సన్ తన రెండు రోజుల భారత పర్యటన కోసం ఈరోజు ముందుగానే గుజరాత్లో అడుగుపెట్టారు. అహ్మదాబాద్లోని విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయన మహాత్మా గాంధీ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు.
బోరిస్ భారత పర్యటన ఇండో-పసిఫిక్లో సహకారాన్ని పెంచడం, ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ)పై చర్చలను నడపడం, అలాగే రక్షణ సంబంధాలను మెరుగుపరచడంపై దృష్టి పెడుతుంది.
UKలో దాదాపు సగం మంది బ్రిటిష్-ఇండియన్ జనాభాకు పూర్వీకుల నివాసం అయిన గుజరాత్లో UK ప్రధానమంత్రి రావడం ఇదే మొదటిసారి.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.)