తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని ప్రతిపాదించింది.
గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి తన బ్యాచిలర్ ఆఫ్ లా (LLB) డిగ్రీని.. గౌహతి విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ ఆఫ్ లా(LLM) పొందారు. ఆ తర్వాత జస్టిస్ ఉజ్జల్ భుయాన్ 1991లో బార్లో చేరి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. గౌహతిలో, గౌహతి హైకోర్టులోని అగర్తలా, షిల్లాంగ్, కోహిమా సహా ఇటానగర్ బెంచ్ల ముందు హాజరయ్యారు. ఉజ్జల్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, గౌహతి బెంచ్ సహా అస్సాం బోర్డ్ ఆఫ్ రెవెన్యూలో కూడా ప్రాక్టీస్ చేశారు.
మే 1995లో జూనియర్ స్టాండింగ్ కౌన్సెల్గా ప్రారంభించి 16 సంవత్సరాల పాటు ఆదాయపు పన్ను శాఖలో స్టాండింగ్ కౌన్సెల్గా ఉన్నారు. ఆయన ఏప్రిల్ 2002 నుంచి అక్టోబర్ 2006 వరకు గౌహతి హైకోర్టు ప్రధాన సీటులో మేఘాలయ అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా ఉన్నారు.
ఆయన ముంబై హైకోర్టు నుంచి బదిలీ అయిన తర్వాత 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2019లో గౌహతి హైకోర్టు నుంచి బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. అయితే సీనియార్టీ జాబితాలో 15 వ స్థానంలో ఉన్నవ్యక్తికి పదోన్నతా అంటూ పలువురు నిరసన తెలిపారు.