మహారాష్ట్ర సంక్షోభాన్ని వెన్నుపోటుగా అభివర్ణించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను వెన్నుపోటు పొడిచారంటూ ఓ ఊహాచిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్.
https://twitter.com/rautsanjay61/status/1542360533529432064?s=20&t=bM7Ut6othbRLL0KPQeRmhw
వాస్తవంగా జరిగింది ఇదే అంటూ క్యాప్షన్ ఇచ్చారు.ఆ స్కెచ్ లో తెల్లటి కుర్తా ధరించిన ఉద్ధవ్ అటువైపు తిరిగి ఉన్నారు. రెండు చేతులు లేవు. వీపుపైన మూడు కత్తిగాట్లున్నాయి. రక్తం కారుతున్నట్టుంది. మొత్తంగా నమ్మినవాళ్లే వెన్నుపోటు పొడిచారనే అర్థం వచ్చేలా ఆ ఊహా చిత్రం ఉంది. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 40మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సంగతి తెలిసిందే. బలనిరూపణ చేసుకోవాలని సుప్రీం సైతం ఆదేశించడంతో ఉద్ధవ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.