రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఇద్దరు ఇస్లాం వాదులు నూపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేసినందుకు కన్హయ్య లాల్ అనే టైలర్ తల నరికి చంపారు. ఈ హత్య రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచింది. హంతకులు మోదీసహా నూపుర్ మద్దతుదారులను హెచ్చరిస్తూ చేసిన వీడియో వైరల్ అయింది. వీడియోలను ఆన్లైన్లో పోస్ట్ చేసిన తర్వాత అరెస్టు చేసిన నిందితులిద్దరూ పాకిస్తాన్లోని దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు కలిగి ఉన్నారని నిఘా సంస్థలు భావిస్తున్నాయి.
సున్నీ ముస్లిం సంస్థ దావత్-ఎ-ఇస్లామీ మహమ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రచారం చేసే సంస్థ. ఇది ఇస్లామిక్ అధ్యయనాలలో ఆన్లైన్ కోర్సులను అందిస్తుంది. అలాగే టెలివిజన్ ఛానెల్ని కూడా నడుపుతోంది.
దావత్-ఎ-ఇస్లామీని 1981లో పాకిస్తాన్లోని కరాచీలో మౌలానా ఇలియాస్ అత్తారీ స్థాపించారు. అప్పటి నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా 194 దేశాలకు విస్తరించింది. దాని వ్యవస్థాపకుడి పేరు కారణంగా సంస్థతో అనుబంధం కలిగిన వారు తమ పేర్లకు “అత్తారి”ని జోడిస్తారు.
ముఖ్యంగా ఉదయపూర్ ఘటనలో నిందితుల్లో ఒకరైన మహ్మద్ రియాజ్ కూడా తన పేరు చివర అత్తారి అనే పేరును వాడుకోవడం గమనార్హం.