కరోనాపై పోరు చేస్తున్న భారత్ కు యూఏఈ సంఘీభావం తెలిపింది. ప్రపంచంలోనే అతి ఎత్తైన బూర్జ్ ఖలీఫాపై లేజర్ లైట్లతో త్రివర్ణ పతాక ప్రదర్శన చేసింది. స్టే స్ట్రాంగ్ ఇండియా (భారత్ కరోనాపై ధైర్యంగా పోరాడాలి) అనే సందేశాన్ని ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోను దుబాయిలోని ఇండయన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.
‘కరోనాపై భారత్ యుద్ధం చేస్తున్న సమయాన మిత్రదేశం యూఏఈ తన సహృదయత చాటింది. బుర్జ్ ఖలీఫాపై త్రివర్ణ పతాక ఆవిష్కరణ చేసింది. కరోనాను ధీటుగా ఎదుర్కోవాలని ఆకాంక్షించింది’ అని ఎంబసీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పేర్కొంది. అబుదాబీ ఆయిల్ కంపనీ కార్యాలయంపైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు
https://twitter.com/BurjKhalifa/status/1386353985351729152