కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తుల పోడియం పక్కన ఇద్దరు మహిళలు నమాజ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను మొదట ‘సంవాద’ అనే మీడియా ఛానెల్ తన యూట్యూబ్, ఫేస్బుక్ లలో అప్లోడ్ చేసింది. అప్పటి నుంచి చాలా మంది నెటిజన్లు ట్విట్టర్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో వీడియోను షేర్ చేస్తున్నారు.
కర్ణాటకలోని హిందూ జనజాగృతి సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి మోహన్ గౌడ మే 15న ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు. ముస్లింలు కర్ణాటక హైకోర్టు హాల్ లోపల నమాజ్ చేసారు. హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించిన దోషులపై ఏమైనా చర్యలు తీసుకున్నారా? హైకోర్టు ఆవరణను దుర్వినియోగం చేసినట్లు కాదా? అని” డీజీపీ ప్రవీణ్ సూద్, హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర, డీసీపీ సంజీవ్ ఎం పాటిల్ లను ట్విట్టర్ వేదిగ్గా ప్రశ్నించారు.
Muslims offered Namaz inside the Karnataka High court Hall.
Respected @DgpKarnataka@Copsview @JnanendraAraga@DCPWestBCP @DCPCentralBCP
Any action taken against culprits who violate high court rule ?
Doesn't not misuse of High Court premises?@RituRathaur@MNageswarRaoIPS pic.twitter.com/TQENmyZvPh
— 🚩Mohan Gowda🇮🇳 (@MohanGowda_HJS) May 15, 2022
అనుమతి లేకుండా హైకోర్టు ఆవరణలో చిత్రీకరించిన వీడియోను అప్లోడ్ చేసినందుకు ఛానెల్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. బెంగళూరులోని విధాన సౌధ పోలీస్ స్టేషన్లో ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఎన్జి దినేష్ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఇండియన్ పీనల్ కోడ్ లో సెక్షన్ 447, 505 (2) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ విషయమై కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేసినట్లు మోహన్ గౌడ తెలిపారు. ఇదే విధంగా తాను కూడా ఫిర్యాదు చేసినట్లు న్యాయవాది ఆర్ పుట్టెరయ్య చెప్పారని కర్ణాటక దినపత్రిక హొసడిగంథ పేర్కొంది. న్యాయమూర్తుల బెంచ్ ముందు ప్రవేశించి నమాజ్ చేశారనే ఆరోపణలపై ఇద్దరు వ్యక్తులపై నేను ఫిర్యాదు చేశాను అని పుట్టెరయ్య అన్నారు. కోర్టు గదిలోకి ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులపై విచారణ జరుగుతుందని నమ్మకంగా ఉన్నట్టు యూట్యూబ్ ఛానెల్పై పోలీసు ఫిర్యాదు చేసిన రిజిస్ట్రార్ అన్నారు.