దేశంలో ఒక 12 మంది సీనియర్ రాజకీయ నేతలు ప్రస్తుత కరోనా వెంటనే కట్టడి చేయడానికి కేంద్రానికి 9 సూచనలు చేశారు. వారు
1. సోనియా (కాంగ్రెస్)
2. దేవెగౌడ (జేడీఎస్)
3. శరద్ పవార్ (ఎన్సీపీ)
4. ఉద్ధవ్ థాక్రే (శివసేన)
5. మమత (టీఎంసి)
6. స్టాలిన్ (డీఎంకే)
7. హేమంత్ సొరేన్ (జేఎంఎం)
8. ఫరూక్ అబ్దుల్లా (జెకెపిఏ)
9. అఖిలేష్ (సమాజ్ వాదీ)
10. తేజస్వి యాదవ్ (ఆర్జేడీ)
11. డి. రాజా (సీపీఐ)
12. ఏచూరి (సిపిఎం)
(వీరిలో కలవని నేతలు చంద్రబాబు, జగన్, కేసీఆర్, మాయ, ముఫ్తి)
వీరు చేసిన సూచనలు :
1. వాక్సిన్స్ దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కేంద్రమే సమీకరించండి
2. వెంటనే దేశవ్యాప్తంగా ఉచిత వాక్సిన్ కార్యక్రమం మొదలు పెట్టండి.
3. దేశీయ వాక్సిన్ ఉత్పత్తి పెంచడానికి కంపల్సరీ లైసెన్స్ విధానం అమలు చేయండి.
4. బడ్జెట్ లో కేటాయించిన 35 వేల కోట్లు వెంటనే ఖర్చు చేయండి
5. కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం ఆపండి. దానికి కేటాయించిన డబ్బులు ఆక్సిజన్ కి వాక్సిన్ కి ఖర్చు చేయండి
6. పీఎం కేర్ ఫండ్స్ లో ఉన్న డబ్బులతో వాక్సిన్, ఆక్సిజన్ మెడికల్ పరికరాలు కొనండి.
7. నిరుద్యోగులకు నెలకు ₹6000 ఇవ్వండి
8. ఫ్రీ గా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయండి. గోడౌన్స్ లో కోటి టన్నుల ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయి
9. రైతు చట్టాలు వెనక్కి తీసుకోండి.
సరే మంచి సూచనలు చేశారు. వీటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం.
1. కేంద్రం గత జనవరిలోనే ఈ వాక్సిన్ కార్యక్రమం మొదలు పెట్టి దేశీయంగా మరియు అంతర్జాతీయంగా తయారు చేస్తున్న కంపెనీలను సంప్రదిస్తూ వచ్చిన స్టాక్స్ కి రాష్ట్రాలకు పంపిణీ చేస్తోంది.
మొన్న ఏప్రిల్ లో రెండో వేవ్ వచ్చిన వెంటనే దేశంలో ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వకుండా వాక్సిన్ వ్యవహారం మొత్తం కేంద్రం గుప్పెట్లో ఉంచుకుంది. వాక్సిన్ కావలసిన చోటునుండి కావలసినంత కొనుగోలు చేసుకుందికి రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలి అని రాహుల్ గాంధీ ఏప్రిల్ లో కేంద్రాన్ని కోరితే ఇప్పుడు సరిగ్గా ఒక నెల అయినా కాకుండా పూర్తి యూ టర్న్ తీసుకొని సోనియా గాంధీ ఈ వాక్సిన్ వ్యవహారం మొత్తం కేంద్రం చూసుకోవాలి అంటున్నాయి.
అంటే ఏప్రిల్లో ఒక మాట..మేలో మరో మాట అన్నమాట..
ఈ విషయం మీద ఒకే పార్టీలో ఇద్దరు టాప్ నాయకులకు ఇంత వైరుధ్యం ఉంది. కేంద్రం ఎవరి మాట వినాలి? రాహుల్ మాటా? సోనియా మాటా? వీళ్ళకి ఇంత ముఖ్య విషయం మీద ఒక అవగాహన కానీ స్టాండ్ కానీ ఉందా?
తిరిగి మోడీ ప్రతిపక్షాల సలహాలు తీసుకోవడం లేదు అని విమర్శలు.
చాడాశాస్త్రి